మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మళ్ళీ గాడిలో పడ్డాడు. వరుస పరాజయాల తరువాత చిత్రలహరి తో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆచి తూచి అడుగులు వేస్తున్న సాయి తేజ్ తాజాగా మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇటీవలే ఈ కథను మెగాస్టార్ ఫైనల్ చేసాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు బోగి అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ టైటిల్ పై జనాల్లో పెద్దగా ఆసక్తి కరంగా ఫీడ్ బ్యాక్ రాలేదట. దాంతో టైటిల్ మార్చాలని ఆలోచనలో భాగంగా దర్శకుడు మారుతి కొత్త టైటిల్ ని పెట్టె ఆలోచనలో ఉన్నాడు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. ప్రతిరోజు పండగ? ఈ టైటిల్ బాగుందని టీమ్ అందరు అనడంతో ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో తేజ్ చాలా కొత్తగా కనిపిస్తాడట. చిత్రలహరి విషయంలో కూడా మేక్ ఓవర్ మార్చిన సాయి తేజ్ ఇకపై కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ప్రతిరోజు పండగ అనే టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. విన్నవారంతా బాగుందని అంటున్నారు. సో ఈ దెబ్బతో అటు సాయి తేజ్ కు కూడా ప్రతి రోజు పండగ జరగనుందేమో మరి. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ని ఖరారు చేస్తారట. మరి సాయి తేజ్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Related Posts
అల్లు శిరీష్ పెళ్ళంట.. ఆ హీరో కూతురితోనంట!