ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా పరిణమించిందా? జగన్ వరుసపెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు కేసీఆర్ కు మింగుడుపడటం లేదా? ప్రస్తుత పరిణామాలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా తెలంగాణ, లోటు రాష్ట్రంగా ఏపీ ఉన్నాయి. విభజన తర్వాత తెలంగాణ కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టగా.. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాలేదు. సంక్షేమ కార్యక్రమాల అమలుకూ అడ్డంకులు కలగలేదు. దీంతో రైతుబంధు వంటి పథకాలు ప్రభుత్వానికి పేరు తెచ్చాయి.
ఇక లోటు రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల సమస్య అడ్డంకిగా మారింది. దీంతో సంక్షేమ పథకాల అమలు అంతగా జరగలేదు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు.. ఇలా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు చాలామటుకు అమలుకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు తెలంగాణతో పోల్చుకుని బాధపడేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని వర్గాలపైనా వరాల జల్లు కురిపిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను ఉరకలెత్తిస్తున్నారు.
ముఖ్యంగా అవినీతి మరక అంటితే, మంత్రుల పోస్టు కూడా పీకేస్తానని స్పష్టంగా చెప్పేశారు. పదవీకాలం రెండున్నరేళ్లు కూడా గ్యారెంటీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అలాగే మంత్రులకు తెలియకుండా ఏ విషయం ఉండకూడదని, ఏ విషయమైనా ముందుగా మంత్రుల వద్దకు వెళ్లిన తర్వాతే తన వద్దకు వస్తుందని, తద్వారా తన కేబినెట్ లో మంత్రులు డమ్మీలు కాదనే విషయాన్ని పేర్కొన్నారు. ఇక తొలి కేబినెట్ భేటీలోనే అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఐఆర్ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ఐఆర్ 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత త్వరగా ఈ విషయంలో నిర్ణయం వెలువడుతుందని అనుకోలేదని పేర్కొంటున్నారు.
అలాగే నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇలా ఏపీలో కొత్త సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అసలు డబ్బులే లేని రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణలో ఎందుకు తీసుకోవడంలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ పెంచాలన్న డిమాండ్ తెలంగాణలో చాలాకాలం నుంచి పెండింగ్ లో ఉంది. అలాగే ఆర్టీసీ విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి, జగన్ సర్కారు నిర్ణయానికి చాలా తేడా ఉందనే పోలికలు ప్రారంభమయ్యాయి.
గతంలో ఆర్టీసీ సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తానని హెచ్చరించారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో డొక్కు బస్సులతోనే తెలంగాణ ఆర్టీసీ మనుగడ సాగిస్తోంది. ఇక అవినీతి విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయాలతో పోల్చుకోవడం తెలంగాణలో ప్రారంభమైంది. ఈ పరిణామాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా పరిణమించాయి.
Related Posts
జగన్కి వ్యతిరేకంగా ‘స్కెచ్’ రెడీ చేస్తున్న మోడీ
134829 590859Youd outstanding guidelines there. I did a search about the field and identified that very likely the majority will agree with your internet page. 322322
934647 550139really good put up, i in fact really like this web website, keep on it 281327
716385 98044I genuinely enjoy looking via on this web internet site , it holds superb articles . 29872
544343 681451Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you might be interested in hearing. Either way, fantastic website and I look forward to seeing it expand over time. 528562