హైదరాబాద్ లో ఘోరం జరిగింది. తెలిసినవారు అని నమ్మినందుకు ఓ వివాహిత, ఆమె కూతురు గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ దారుణ అకృత్యం గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ లో చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీలో ఓ వివాహిత తన కూతురు, కుమారుడితో కలసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెపై కన్నేసాడు ఆ ఇంటి ఓనర్. దీంతో అదును చూసి చికెన్ కూరలో మత్తు మందు కలిపి ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఇంటి ఓనర్ కావడంతో కూర తీసుకున్నారు. విషయం తెలియని ఆ ముగ్గురూ మత్తు మందు కలిపిన చికెన్ కూర తిన్నారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఇంటి ఓనర్ వివాహితపై ఆమె 15ఏళ్ల కూమార్తెపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. తనతోపాటు ముగ్గురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు ఒడిగట్టాడు. ఆ సమయంలో ఇంటి ఓనర్ అతని ఫ్రెండ్స్ మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది.
విషయం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. తల్లీ, కుమార్తెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మత్తు పదార్ధం తినడం, గ్యాంగ్ రేప్ కావడంతో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
86108 718573learning toys can enable your kids to develop their motor skills quite easily;; 91556
937863 948681for however another excellent informative post, Im a loyal reader to this weblog and I cant stress enough how a lot valuable info Ive learned from reading your content. I really appreciate all the hard work you put into this wonderful blog. 908683