Switch to English

బ్లడ్ బ్రదర్స్ కు ‘చిరు భద్రత’.. గవర్నర్ ప్రశంస

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

దేశంలోని సూపర్ స్టార్స్ గా చెలామణీ అయ్యే హీరోల్లో తమ ఫ్యాన్స్ గురించి విభిన్నంగా ఆలోచించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాన్స్ అంటే సినిమా రిలీజ్ కి కటౌట్లు బ్యానర్లు, పాలాభిషేకాలు, హంగామా మాత్రమే చేసేవారిగా దశాబ్దాలుగా సమాజంలో వారిపై ఉన్న గుర్తింపును చిరంజీవి పూర్తిగా మార్చేశారు. తనకున్న అశేష అభిమాన గణాన్ని సేవా మార్గం వైపు నడిపించారు. 1998లో ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రక్తదానం, నేత్రదానం చేసేలా వారిని ప్రోత్సహించారు. దేశంలో మరే స్టార్ హీరో ఇలా చేయలేదు. ఫ్యాన్స్ కూడా చిరంజీవి చూపిన మార్గంలో అంతే నిబద్ధతతో నడిచి చిరంజీవికి మరింత పేరు తెచ్చారు. దీంతో మెగాభిమానుల్ని బ్లడ్ బ్రదర్స్ గా అభివర్ణించారు చిరంజీవి. ఇప్పుడు మరో ముందడడుగు వేసి వారికి “చిరు భద్రత” ఇన్స్యూరెన్స్ చేయించడం విశేషం.

బ్లడ్ బ్రదర్స్ కు ‘చిరు భద్రత’.. గవర్నర్ చేతుల మీదుగా ఇన్స్యూరెన్స్ కార్డులు అందించిన చిరంజీవి

గవర్నర్ ప్రశంస..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ‘చిరు భద్రత’ పేరుతో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. 50 కంటే ఎక్కువసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేసిన వారికి రాజ్ భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా కార్డులు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవిని గవర్నర్ అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఒక డాక్టర్ గా రక్తం విలువ తెలుసు. తన వృత్తిలో భాగంగా రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసేందుకు బంధువులు ముందుకు రాని పరిస్థితులు చూశాను. చిరంజీవి రక్తదానం కార్యక్రమంలో అభిమానుల్ని ప్రోత్సహించడం సంతోషించే విషయం. రక్తదానం చేసేవారు నిజమైన హీరోలు. రెడ్ క్రాస్ తరఫున రక్తదానం కోసం యాప్ రూపొందించాం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇందులో భాగం కావాలని కోరుతున్నాం’ అని అన్నారు.

 

ఆ వార్తలే కదిలించాయి..

చిరంజీవి మాట్లాడుతూ.. ‘సమయానికి రక్తం అందక చనిపోతున్న బాధితుల వార్తలు నన్ను కదిలించాయి. దీంతో తనపై ప్రేమ చూపే అభిమానుల్ని అదే ప్రేమను నలుగురికీ పంచేలా 1998లో చిరీంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా మాటే వేదంగా అభిమానులు రక్తం దానం చేస్తున్నారు. అటువంటి వారికి ఏదైనా భద్రత కల్పించాలని సంకల్పించి ‘చిరు భద్రత’ పేరుతో ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. ఇప్పటివరకూ ట్రస్ట్ ద్వారా 9.30లక్షల యూనిట్లు రక్తం సేకరించి పేదలకు 70శాతం అందించి.. మిగిలిన శాతం ప్రైవేటు ఆసుపత్రులకు అందించాం. రక్తదానం చేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు’ అని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలను గవర్నర్, చిరంజీవి సత్కరించి, ప్రశంసించారు. చిరంజీవి చేసిన ఈ కార్యక్రమం ద్వారా అభిమానులపై ఆయన చూపే ప్రేమకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...