Switch to English

‘చిరంజీవి గారూ, మా కుటుంబం..’ విబేధాల వార్తలపై అల్లు అరవింద్ క్లారిటీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ ప్రాముఖ్యత వేరు. దేశంలో మరే సినీ కుటుంబం నుంచి కూడా ఉండనంత హీరోలు, నటీనటులు ఉండటం మెగా ఫ్యామిలీ ప్రత్యేకత. అయితే.. ఈమధ్య మెగా ఫ్యామిలీలో విబేధాలు వచ్చాయని.. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని అనేక రూమర్లు వస్తున్నాయి. వీటిపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తమ కుటుంబం అంతా ఒక్కటిగానే ఉందని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మమ్మల్ని టార్గెట్ చేయడం తేలిక..

‘చిరంజీవి గారి కుటుంబంతో మా అనుబంధంలో ఏ మార్పూ లేదు. ఇరు కుటుంబాల్లో ఏ ఫంక్షన్ జరిగినా.. పండుగల సందర్భంలోనైనా అందరం కలుస్తాం. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఎవరికి వారు సొంతంగా కెరీర్లో రాణిస్తున్నారు. అన్ని సందర్భాల్లో కలవడం ఒక్కోసారి సాధ్యం కాదు. దీంతో ఇటువంటి రూమర్లు వస్తున్నాయి. క్రేజ్ ఉన్న కుటుంబంపైనే ఇటువంటి గాసిప్స్ వస్తాయి. ఒక స్తంభం, కొండలో దేనిని కొట్టాలంటే కొండనే కొడతారు. తేలిగ్గా తగులుతుందని. ఇవీ అంతే’ అని అరవింద్ వాటిని కొట్టిపారేశారు’.

బంధుత్వానికి మించి స్నేహం..

‘చిరంజీవితో అనుబంధం గురించి మాట్లాడుతూ.. బంధుత్వానికి ముందే చిరంజీవి గారితో పరిచయం ఉంది. సురేఖతో పెళ్లి సంబంధమై మొదట మా అమ్మగారు ఇంట్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటికి రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకునే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. కానీ.. సంబంధం కుదిరి పెళ్లి చేసుకున్నారు. మొదటి రెండేళ్లు చిరంజీవి గారితో బావాబావరిది రిలేషనే ఉండేది. తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. సినిమాలు, కుటుంబ విషయాలు పంచుకుంటూ బంధుత్వానికి మించి సాన్నిహిత్యం ఏర్పడింది’.

రాజకీయాల్లో అవే బాధించాయి..

‘రాజకీయాల్లో అనేక సంఘటనలు బాధపెట్టాయి. ఉత్తరాంధ్ర నుంచి ఓ నాయకుడు వచ్చి చిరంజీవి గారిని కలిసేందుకు తపించిపోయాడు. నన్ను చిరంజీవి గారితో కలిపించమని ప్రాధేయపడ్డాడు. తర్వాత అదే వ్యక్తి బయటకెళ్లిపోయి పార్టీని దూషించి చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇలాంటివాళ్లు రాజకీయాల్లో ఉంటారా అని బాధపడ్డారు చిరంజీవి’ అని వెల్లడించారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...