వివిధ నేరాలకు పాల్పడే మనుషులకు జైలు శిక్షలు పడుతుంటాయి. అవి సాధారణం. కానీ ఇక్కడ ఓ పులికి జీవితఖైదు విధించారు. ముగ్గురు వ్యక్తులను చంపిన నేరానికి గానూ జీవితాంతం దానిని బందిఖానాలోనే ఉంచాలని నిర్ణయించారు. అది అత్యంత ప్రమాదకరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఐదేళ్ల వయసున్న ఈ మగ పులి 2018లో మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోని బీటుల్ జిల్లాకు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకుంది. అయితే, అది అడవిలో ఉండకుండా మానవ ఆవసాల్లోకి వెళ్లి దాడులు చేయడం ప్రారంభించింది. పశువులను వేటాడటంతోపాటు మనుషులను కూడా గాయపరిచింది. మొత్తం మగ్గురిని పొట్టనబెట్టుకుంది. దీంతో అది ఉన్న ప్రాంతంలో ప్రజలు భయాందోళనలకు గురికావడంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకుని టైగర్ రిజర్వులో వదిలిపెట్టారు.
అయినప్పటికీ అది మానవ ఆవాసాల్లోకి వచ్చి పశువులపై దాడులు చేయడం మానలేదు. దీంతో అది మనుషులకు ప్రమాదకరంగా మారిందని భావించిన అధికారులు.. ఆ పులిని ఇక జీవితాంతం బంధించాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం దానికి మత్తుమందిచ్చి భోపాల్ లోని జూకి తరలించారు.
నిజానికి దానిని బంధించాలని కొన్ని నెలల క్రితమే అనుకున్నా.. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం దానిని జూలో నిర్బంధించారు. కొన్నిరోజులపాటు దాని ప్రవర్తనను పరిశీలిస్తారు. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి దానికి కొంత సమయం పడుతుందని, అనంతరం దానిని సందర్శకులు చూసే విధంగా ఉంచాలా లేక టైగర్ సఫారీకి తరలించాలా అనేదానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని భోపాల్ నేషనల్ పార్క్ డైరెక్టర్ వెల్లడించారు.
577448 178655extremely good post, i undoubtedly adore this incredible internet site, carry on it 852911