విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేటీకరించవద్దంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెల్సిందే. సీఎం జగన్ రాసిన లేఖలకు స్పందించాల్సిందిగా పీఎంఓ వారు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగానికి సూచించడం జరిగింది. పైవేటీకరణ పునరాలోచించాల్సిందిగా పీఎంను సీఎం కోరడంతో దానిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమాధానం ఇవ్వాల్సిందిగా పీఎంఓ నుండి ఆదేశం జారీ అయ్యింది.
సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా సీఎం జగన్ రాసిన లేఖకు ప్రధాని నరేంద్ర మోడీ నుండి వచ్చిన సమాధానం ఏంటీ అంటూ ప్రశ్నించారు. అందుకు పీఎంఓ నుಂడి ఈ సమాధానం లభించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోగా గత నెల రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో పీఎంఓ సమాధానం ఆసక్తికరంగా మారింది. సదరు సంస్థ వారు సీఎం జగన్ కు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.
229238 779786I will proper away grasp your rss as I can not in obtaining your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Kindly permit me realize so that I could subscribe. Thanks. 750191