Pawan Kalyan: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ (Padma Vibhushan) పురస్కారాలతో గౌరవించడంపై జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భారతీయ చిత్రసీమలో స్వయంకృషితో ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న అన్నయ్య చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. తపనతో ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేసి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు’.
‘మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన శ్రీ వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు’ అని అన్నారు.
ఈ సందర్భంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు తెలిపారు.