Switch to English

కిరాయి మూకలకు భయపడం.! వెయ్యి కోట్లు సుపారీ ఇచ్చుకున్నా బెదరం: పవన్ కళ్యాణ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘మీ దగ్గర కిరాయి మూకలుంటే భయపడతామా.? 250 కోట్లు కాదు.. 1000 కోట్లు సుపారీ ఇచ్చుకో.. మేం బెదరం..’ అంటూ నేరుగా వైసీపీకి సవాల్ విసిరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత కొద్ది రోజులుగా హైద్రాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్న విషయం విదితమే.

అనుమానితుల్ని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తప్పతాగి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గలాటా చేశారనీ, రెక్కీకి సంబంధించి ఆధారాలు లభించలేదనీ, నిందితులకు నోటీసులు ఇచ్చామని పోలీసులు పేర్కొన్నారు.

అయితే, జనసేన మాత్రం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర చేస్తున్నారనీ, 250 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి ఆయన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత స్పందించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి ఇప్పటం బయల్దేరిన జనసేనాని, మీడియాతో మాట్లాడారు.

‘ఇప్పటంలో ఇళ్ళను కూల్చేస్తారా.? జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం భూముల్ని ఇచ్చిన రైతుల్ని వేధిస్తారా.? ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో డ్రామాలు ఆడితే.. ఇడుపులపాయలో హైవే వేస్తాం జాగ్రత్త..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు జనసేన అధినేత.

‘సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో సీఎం.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీనించాయి.. కక్ష సాధింపు చర్యలు రాజ్యమేలుతున్నాయి.. రక్తం చిందిస్తాంగానీ, మీ బెదిరింపులకు దిగం..’ అంటూ జనసేనాని నినదించారు. జనసేన అధినేతను మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దనే నిర్భందించేందుకు పోలీసులు యత్నించగా, ఆయన కాలి నడకన ఇప్పటం బయల్దేరారు. పెద్ద సంఖ్యలో జనసైనికులు పవన్ కళ్యాణ్ వెంట నడవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

దాంతో, జనసేనాని కొంత దూరం నడిచి, ఆ తర్వాత వాహనంపైకెక్కి ఇప్టపం గ్రామానికి వెళ్ళారు. రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేసిన సామాన్యుల ఇళ్ళను పరిశీలించారు జనసేనాని. దేవుళ్ళ విగ్రహాల్ని సైతం కూల్చేశారనీ, సామాన్యుల ఇళ్ళను ధ్వంసం చశారనీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రం టచ్ చేయలేదని జనసేనాని మండిపడ్డారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...