భారత్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇందుకోసం అది ఉగ్రవాదులకు సాయపడుతూ ఉంటుంది. కాశ్మీర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చొరబాటుదారులు భారత భూభాగంలోకి వెళ్లేలా చేస్తుంటుంది. తాజాగా ఉగ్రవాదులకు ఆయుధాలు అందజేసేందుకు అదో కొత్త మార్గం అవలంభిస్తోంది. డ్రోన్ లో ఆయుధాలు ఉంచి మన భూభాగంలోకి పంపిస్తోంది. ఇలా శనివారం తెల్లవారుజామున కతువా సెక్టార్ లోకి ప్రవేశించిన డ్రోన్ ను మన బలగాలు కూల్చివేశాయి.
అనంతరం దానిని పరిశీలించగా అమెరికాకు చెందిన ఎం4 రైఫిల్ తోపాటు రెండు మేగజీన్లు, కొన్ని తూటాలు లభ్యమయ్యాయి. అలీ భాయ్ అనే టెర్రరిస్టు పేరు దానిపై రాసి ఉంది. 8 అడుగుల వెడల్పులో ఉన్న ఆ డ్రోన్ ను పినేసార్ లోని ఆర్మీ పోస్టుకు సమీపంలోని పాక్ భూభాగం నుంచి ఆపరేట్ చేసినట్టు గుర్తించారు. శనివారం ఉదయం 5.10 గంటల సమయంలో ఆ డ్రోన్ మన భూభాగంలోకి ప్రవేశించి దాదాపు 250 మీటర్ల మేర వచ్చిందని, వెంటనే మన బలగాలు తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపి దానిని కూల్చివేశారని అధికారులు వెల్లడించారు.
డ్రోన్లతో ఆయుధాలు పంపడం ఇటీవల కాలంలో ఎక్కువైందని పేర్కొన్నారు. ఇటీవల జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాది కాల్పుల్లో మరణించాడని, అతడి వద్ద ఇలాంటి ఆయుధాలే స్వాధీనం చేసుకున్నామని ఓ అధికారి వివరించారు. ‘మనదేశంలో కల్లోలం సృష్టించే లక్ష్యంతో జైషే టెర్రరిస్టులకు పాక్ సంస్థలు ఇలా ఆయుధాల్ని అందిస్తున్నాయి. గతంలోనూ కుప్వారా, జమ్ము, రాజౌరీ సెక్టార్లలో పాక్ చేసిన ఇలాంటి ప్రయత్నాలను మన బలగాలు నిర్వీర్యం చేశాయి’ అని ఆయన పేర్కొన్నారు.
డ్రోన్ లో దొరికిన ఆయుధాలు:
103429 987300A genuinely fascinating examine, I could not concur totally, but you do make some very valid points. 35472
745966 254636Do you wear boxers or biefs? I wana bui em. 482098
172277 164263I like this internet site because so a lot utile stuff on here : D. 392358