వరంగల్ లో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. వేధింపులు భరించలేక బిటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రక్షిత నర్సంపేటలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె అక్కడే హాస్టల్ లో ఉంటుంది.
స్వగ్రామంలో పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయమైన రాహుల్ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నట్లు, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో రక్షిత ఆమె తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసారు. భూపాలపల్లి పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినా తీరులో మార్పు రాలేదు.
హాస్టల్ లో ఉంటే ఇబ్బంది అవుతుందని రక్షిత తండ్రి తన సోదరుడి ఇంటికి పంపించగా తన బాబాయ్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాహుల్ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందంటూ రక్షిత తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
108888 504380Intriguing post. Positive that Ill come back here. Good function. 839254