పీజీ వైద్య విద్యార్ధిని మృతితో నిమ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి తండ్రి తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘వరంగల్లో ఉద్యోగానికి పోయిన నా కుమార్తె శవాన్ని నా చేతిలో పెడుతున్నారు. తను ఎలా చనిపోయింది.. ఎందుకు చనిపోయిందనేది తెలియాలి. వాస్తవాలు బయటకు రాకుండా మృతదేహాన్ని తీసుకెళ్లమంటే ఎలా. నాకు అనుమానాలు ఉన్నాయి’.
‘ప్రిన్సిపల్, హెచ్ఓడీను సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపాలి. ఆ రాత్రి ఏం జరిగింది.. సూసైడ్ ఎందుకు చేసుకుంది నాకు తెలియాలి. నాకు న్యాయం జరగాలి. ప్రీతిది ఆత్మహత్య అంటున్నారు. అది నిజం కాదు. ప్రభుత్వం విచారణ చేస్తామని చెప్తోంది. వాళ్లుండగా నిజం బయటకు రాదు, నాకు న్యాయం జరగదు. విద్యార్ధులు, సీనియర్ డాక్టర్లతో బెదిరించి స్ట్రైక్ చేయిస్తున్నారు. కేస్ హిస్టరీ నాకు తెలియాలి. నా కుమార్తెకు, నాకు న్యాయం జరగాలి. ఇది నా డిమాండ్’ అని అన్నారు.
మరోవైపు ప్రభుత్వం తరపు నుంచి ప్రీతి కుటుంబసభ్యులకు రూ. 10లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించింది.
881015 694102I truly enjoy examining on this web site , it has excellent content material . 974178
230361 143209Thanks for this great post! It has long been really beneficial. I wish that youll carry on posting your wisdom with us. 189430