ఉత్తర ప్రదేశ్ షాజాహాన్పూర్ జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజ్ లో బీఏ రెండవ సంవత్సరం చదువుతున్న యువతి సాయంత్రం సమయంలో కాలేజ్ కు దూరంగా నిర్మానుశంగా ఉన్న ప్రాంతంలో కాలిన గాయాలతో పడి ఉంది. నగ్నంగా కాలిన గాయాలతో రోడ్డు మీద పడి ఉన్న యువతిని గుర్తించిన బాట సారులు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఆమె నుండి వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా ప్రస్తుతం ఆమె ఏం చెప్పే స్థితిలో లేదు. 60 శాతం కాలిన గాయాలతో ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ముఖం, మెడ, ఛాత్రి భాగంలో ఆమె కు కాలిన గాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజ్ లో ఆమె స్నేహితులను పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం. ఆమె నోరు విప్పితే కాని అసలు విషయం ఏంటీ అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రెండు రోజుల వరకు ఆమె పరిస్థితి సీరియస్ గానే ఉంటుందని అంటున్నారు.
100386 829758so significantly excellent info on here, : D. 226501
645980 548768I saw a lot of internet site but I believe this 1 has got something special in it in it 431991