హైదరాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించే ఇందిరాపార్కు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ‘పెళ్లి కాని జంటలకు పార్కులోకి ప్రవేశం లేదు’ అనే ఫ్లెక్సీని అధికారులు కట్టడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నిబంధనపై సమాజం, మహిళా సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇందిరా పార్కు నిర్వాహకులు ఫ్లెక్సీ తొలగించారు. అయితే.. ఈ నిబంధనపై సోషల్ మీడియా హోరెత్తిపోయింది.
‘తాలిబన్లు ఎక్కడో లేరు.. హైదరాబాద్ లోనే ఉన్నారు’.. ‘మనం ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా’, ‘పార్కుకు వెళ్లాలంటే పెళ్లి సర్టిఫికెట్ తీసుకెళ్లాలా’, ‘చెత్త తొలగించాల్సిన మున్సిపల్ అధికారులు ఈ చెత్త నిబంధనలు ఏంటి’.. అనే కామెంట్లు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీంతో పార్కు నిర్వాహకులు దిగొచ్చి వెంటనే బ్యానర్ తొలగించారు. అయితే.. జీహెచ్ఎంసీ తీరుపై పౌర సంఘాలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఇదేం నిబంధన అంటూ మున్సిపల్ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు.
పార్కులో అసాంఘీక కార్యకలాపాలు జరిగితే వాటిని అరికట్టే చర్యలు తీసుకోవాలి కానీ.. పార్కుకి వచ్చే ప్రజలపై నిబంధనలు విధించడం ఏంటి..? అని భూమిక ఉమెన్స్ కలెక్టివ్ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. అసలు పార్కుకు వచ్చేవారికి పెళ్లైందా..? లేదా..? అని ఎలా నిర్ధారిస్తారనేది మరో ప్రశ్నగా మిగిలింది. ‘పార్కులోకి పెళ్లైన వారికే ప్రవేశం’ అంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19డీ, 19ఇ ప్రకారం ఫ్రీడం ఆఫ్ మూమెంట్ ను హరించడమే అని సామాజిక కార్యకర్త తోట రాంబాబు అన్నారు.
కొత్త నిబంధనతో ఇందిరా పార్కు సందర్శకులు లేక బోసిపోయింది. ప్రేమికులు పార్కు సిబ్బందితో వాదనలకు దిగారు. దీనిపై పోలీసులు స్పందించి పార్కు వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పార్కులోకి ప్రవేశంపై విషయం బాగా వైరల్ కావడంతో పార్కు సిబ్బంది బ్యానర్ తొలగించారు. ప్రేమికులకు పార్కులోకి ప్రవేశం కల్పించారు. దీంతో విషయం సద్దుమణిగింది.
705333 964184I believe this web site has quite superb composed subject material articles . 42467
135246 97832Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your blog and appear forward to new posts. 966038