అధికారంలో ఉన్నవారు ప్రజా సొమ్మును ఖర్చు చేసే తీరే వేరు. ప్రజల సొమ్మంటే పొదుపు అన్న ప్రసక్తే రాదు. అదే జేబులో నుంచి తీసి ఖర్చు చేయాలంటే మాత్రం మనసు ఒప్పదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో చేసిన దుబారా అంతా ఇంతా కాదు. ప్రజాధనాన్ని ఇష్టమొచ్చిన రీతిలో ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని దివాళా తీయించారు.
తాజాగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐదేళ్లలో వారు కాఫీ, టీల కోసం వెచ్చించింది ఎంతో తెలుసా? అక్షరాలా ఇరవై ఐదు లక్షలు రూపాయలు. ఐదేళ్లలో ఇదేమంత పెద్ద మొత్తం కాదంటారా? కానీ ఇది కేవలం విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంటులో ఖర్చు చేసిన మొత్తం మాత్రమే.
ఐదేళ్లలో దాదాపు ఓ 50 సార్లు మాత్రమే చంద్రబాబు, లోకేశ్ లు విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. అలా వెళ్లిన సమయంలో కాసేపు వీఐపీ లాంజ్ లో సేద తీరేవారు. ఆ సమయంలో టీడీపీ నేతకే చెందిన ఫ్యూజన్ రెస్టారెంటు నుంచి కాఫీ, టీ, స్నాక్స్ సర్వ్ చేసేవారు. అలా ఇచ్చిన కాఫీ, టీలకు సంబంధించి రూ.25 లక్షల బిల్లు అయింది. ఈ రెస్టారెంటుకు 2016లో ఓసారి రూ.12 లక్షలు బిల్లు చెల్లించగా.. 2017 నుంచి 2019 వరకు రూ.13.44 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉంది.
సదరు బిల్లు చెల్లించాలంటూ రెస్టారెంటు ప్రభుత్వానికి విన్నవించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ మొత్తం కేవలం 26 బిల్లులకు సంబంధించింది మాత్రమే కావడం విశేషం. అంటే విమానాశ్రయానికి వెళ్లిన ప్రతిసారీ కాఫీ, టీలకే రూ.50వేలు వెచ్చించారన్న మాట. ప్రజా ధనం అంటే ఎంత లోకువో అర్థమవుతోంది కదూ.
419374 963542definitely like your web website but you require to check the spelling on several of your posts. Several of them are rife with spelling troubles and I locate it very troublesome to tell the truth nevertheless I will surely come back once more. 125572
554506 69171You got a extremely amazing internet site, Sword lily I observed it by means of yahoo. 44355