స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. తన భార్యపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారంటూ భువనేశ్వరి భర్త, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కన్నీరు మున్నీరయ్యారు మీడియా ముందు.
దాంతో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా, నందమూరి కుటుంబ సభ్యులు కొందరు మీడియా ముందుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ మరో సోదరి చాముండేశ్వరి, సోదరుడు రామకృష్ణ తదితరులు మీడియా ముందుకొచ్చి, వైసీపీ నేతలు భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు.
నారా భువనేశ్వరి మీద వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసి వుంటే ఖండించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సభ్య సమాజం ఇలాంటి వ్యవహారాల్ని హర్షించదు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనేది నాయకత్వం అనిపించుకోదు. ఆ సంగతి పక్కన పెడదాం.
స్వర్గీయ నందమూరి తారకరామారావు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుని అప్పట్లో నందమూరి కుటుంబం ఎందుకు ఖండించలేకపోయింది. స్వర్గీయ ఎన్టీయార్, తనను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కన్నీరు మున్నీరైతే, ఎన్టీయార్ కుటుంబం నుంచి ఎవరూ ఆయన తరఫున నిలబడలేదేం.?
‘అబ్బే, అది వెన్నుపోటు కాదు.. నాయకత్వ మార్పు.. లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ, అలాగే రాష్ట్రం ప్రమాదంలో పడింది కాబట్టే ఆ నిర్ణయం..’ అని చెబుతుంటారుట టీడీపీలో కొందరు నేతలు. కానీ, స్వయానా ఎన్టీయార్ కంటతడి పెట్టారు, బోరున విలిపించారు.. అల్లుడు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుపై.
అన్ని వ్యవహారాలూ ఇప్పుడు చర్చకు వస్తున్నాయ్.. నందమూరి కుటుంబం ఈ రోజు మీడియా ముందుకొచ్చి.. చంద్రబాబుకి మేలు చేయకపోగా.. నందమూరి కుటుంబమే విమర్శల్ని ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది.
623733 943402Spot on with this write-up, I really assume this website needs much far more consideration. Ill probably be once much more to read far a lot more, thanks for that information. 293394