ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన వైరా, కొణిజర్ల మండలాల స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆసక్తికర పరిణామం జరిగింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో ఆలస్యంగా వచ్చిన పొంగులేటిని ఉద్దేశించి కార్యకర్తలు శీనన్నా.. జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘నేనూ.. శీనన్న కేటీఆర్కు రెండు కళ్లు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం. మేమంతా మంచిగనే ఉన్నాం. కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించుకుందాం. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ఇక్కడ వ్యక్తిగత నినాదాలు సరికాదని కూడా హితవు పలికారు.
పార్టీ మారుతారనే వస్తున్న ఊహాగానాల మధ్య మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్ పెట్టారు. ‘తాము కలిసికట్టుగా పనిచేస్తున్నామని.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి అంటూ తాను టీఆర్ఎస్లోనే ఉన్నానని, టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. బీజేపీ మైండ్ గేమ్ ను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు.
906103 204066Cause thats required valuable affiliate business rules to get you started on participating in circumstances appropriate for your incredible web-based business concern. Inernet marketing 408067