తెలంగాణలో వ్యవసాయ భూములు, మ్యూటేషన్ ను ధరణి పోర్టల్ ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతాయి. ధరణి పోర్టల్ ఇప్పటికే ప్రజాదరణ చూరగొంది. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోర్టల్ ను తీర్చిదిద్దిన అధికారులకు అభినందనలు. తెలంగాణ భూమి రిజిష్ట్రేషన్ ప్రక్రియలో ఇదొక నూతన శకం అని ప్రజలు అంటున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికింది. కొన్ని సమస్యల పరిష్కారం అనంతరం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని నిర్ణయించాం. ఈనేపథ్యంలోనే 23 నుంచి సేవలు ప్రారంభం కాబోతున్నాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నాం’ అని సీఎం అన్నారు.
ఇందుకు సంబంధించి హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్.. ఇతర ముఖ్య ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
465348 842271Oh my goodness! an incredible write-up dude. Thanks a ton Nonetheless I will likely be experiencing dilemma with ur rss . Do not know why Not able to join it. Can there be everyone acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 32353