Switch to English

వలస కూలీల వేదన వర్ణణాతీతం.. ఎవరిదీ పాపం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నెత్తిన మూట.. చంకలో బిడ్డ.. చేతిలో సంచి.. కాలినడకన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరికి పయనం.. మధ్యలో ఎన్నో అష్టకష్టాలు.. తీరా అన్నీ దాటుకుని సొంత రాష్ట్రానికి వచ్చినా అనుమతిస్తారో లేదో తెలియని పరిస్థితి.. ఇదీ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకూలీల దుస్థితి. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో ఉపాధి కోల్పోయిన వీరంతా.. కలో గంజో తాగి సొంతూళ్లోనే ఉందామనే భావనతో కాలినడకన ఇంటికి వెళ్లే సాహసానికి పూనుకున్నారు. మార్గమద్యంలో కొంతమంది అసువులు బాసినవారు కూడా ఉన్నారు. అసలు వీరికి ఇలాంటి దుస్థితి రావడానికి కారణమెవరు? మన పాలకులకు ముందు చూపు లేకపోవడమేనా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

భారత్ వంటి పెద్ద దేశంలో కోట్లాది మంది బతుకుతెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని పనులు చేసుకుంటుంటారు. అయితే, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో దేశం మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పేదలకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించినా.. అది రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అందింది. కానీ కోట్లాది మంది ఉన్న వలస కూలీల సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. అసలు వారికి సాయం చేయాలనే సంగతినే దాదాపుగా విస్మరించారు. దీంతో ఉంటున్న చోట పనులు లేకపోవడంతో పస్తులుండలేక ఇంటికి వెళ్లిపోదామని వేలాది మంది కాలినడక బయలుదేరారు.

నెలరోజులపాటు పాలకులు వారి బాధలు పట్టించుకోకుండా చివరకు వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లను ప్రవేశపెట్టారు. కానీ కోట్లాది మేర ఉన్న కార్మికులను తరలించడం అంత సులభమైన విషయం కాదనే సంగతి వెంటనే అర్థమైపోయింది. దీంతో వలస కార్మికుల తరలింపు మార్గదర్శకాల్లో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది. కేవలం లాక్ డౌన్ ముందు వేరే ప్రాంతాలకు వెళ్లి చిక్కుకుపోయినవారిని మాత్రమే తరలిస్తామని పేర్కొన్నారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే వారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీరి విషయంలో సానుకూలంగానే వ్యవహరించినా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చేతులెత్తేశాయి. ఇక సొంతూళ్లకు వెళ్లిన కార్మికులు మళ్లీ తిరిగి వస్తారా లేదా అనే మీమాంస కూడా పలువురిని వెంటాడుతోంది. ఒకవేళ వారు రాకుంటే నిర్మాణరంగం బాగా ప్రభావితమయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...