విశాఖ గ్యాస్ లీక్ ఎపిసోడ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న తనకు స్టైరీన్ అంటే ఏమిటో తెలియదని, ఇక ఐఏఎస్ లకు ఏమి తెలుస్తుందని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలు బాబుకు ఏమైందని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిన ఆ బాబు ఈ బాబు ఒకరేనా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక పరిహారం విషయంలోనూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిహాసానికి గురవుతున్నాయి.
రూ.కోటి మనిషి బతికి వస్తాడా? అసలు రూ.కోటి సరిపోతాయా? అయినా డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా? అని ఆయన అనడంపై విస్తుపోతున్నారు. చనిపోయినవారిని తిరిగి తీసుకురావడం ఎవరి వల్లా కాదు. బాధిత కుటుంబీకులకు జరిగిన నష్టాన్ని దేంతోనూ పూడ్చలేం. కానీ ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం ఆనవాయితీ. ఆ డబ్బులతో వారు సుఖపడిపోతారని కాదు.. చినపోయినవారిని తిరిగి ఎలాగూ తీసుకురాలేం, కానీ మీకు ఏ లోటూ రాకుండా చూసుకునేందుకు ఈ విధంగా సాయం చేస్తాం అని చెప్పడమే ఈ ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికి కారణం. నిజానికి ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే రాజకీయ పార్టీల డిమాండ్ కూడా ఇదే ఉంటుంది. ఎవరికి తోచినరీతిలో వారు నష్టపరిహారం డిమాండ్ చేస్తుంటారు.
ప్రభుత్వం మాత్రం తాను ఇవ్వాలనుకున్నది ఇచ్చి చేతులు దులుపుకొంటుంది. విశాఖ గ్యాస్ దుర్ఘటనపై కూడా వివిధ రాజకీయ పార్టీలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఒక్కో పార్టీ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు నష్టపరిహారం ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేయాలని అనుకున్నాయి. కానీ సీఎం జగన్ రూ.కోటి పరిహారం ప్రకటించడంతో వారికి మాట్లాడటానికి వేరే అంశం లేకుండా పోయింది. మరోవైపు టీడీపీ నేతలు ఈ విషయంలో విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రూ.కోటి పరిహారం సరిపోదని, దానిని పది రెట్లు పెంచాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎంత పరిహారం ఇచ్చారో అచ్చెన్నాయుడు మరచిపోయారా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వాదోపవాదాలను పక్కన పెడితే.. తాజాగా ప్రమాదానికి కారణమైన కంపెనీని అక్కడ నుంచి తరలించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది సహేతుకమైందే. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన ఇలాంటి ప్లాంట్లు జవాసాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ సర్కారు ఆ కంపెనీకే వత్తాసు పలుకుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి అధికార పక్షం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
874631 465192A weblog like yours really should be earning considerably cash from adsense..-., 777708
240765 541000This is an excellent post and I entirely recognize where your coming from in the third section. Perfect read, Ill regularly follow the other reads. 376862
116788 591125its great as your other articles : D, regards for posting . 692410
43460 401198There is noticeably a great deal to realize about this. I suppose you made certain good points in attributes also. 824722