పూణె, ముంబై, చెన్నై తర్వాత మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటయ్యే నాలుగో నగరంగా హైదరాబాద్ నిలువనుంది. నగరంలో 15వేల కోట్లతో నూతన డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోపాఫ్ట్ ఇండియా ప్రకటించింది. డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాదైనా పడుతుందని.. 2025 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. ఈమేరకు గచ్చిబౌలిలోని సంస్థ క్యాంపస్ లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కీలక ప్రకటన చేశారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రావడం తెలంగాణ అభివృద్ధిలో మరో మైలురాయి అని అన్నారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర ఐటీ రంగం గతేడాదితో పోలిస్తే 12.8 శాతం వృద్ధి సాధించి డేటా సెంటర్లకు హబ్ గా మారుతోందన్నారు. పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడింగ్ లో అవకాశాలు అపారంగా ఉన్నాయని.. మైక్రోసాఫ్ట్ మాదిరిగి ఇతర కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.
294431 317689you are in point of fact a good webmaster. The internet site loading velocity is amazing. It seems that youre doing any distinctive trick. In addition, The contents are masterpiece. youve done a terrific activity on this topic! 713404