మద్యం మత్తు తలకెక్కిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అడిగిన వెంటనే పకోడీ తేలేదనే ఆగ్రహంతో తన కారుతో పకోడీ బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో పకోడీ బండి యజమాని కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. కిర్లంపూడి మండలం వీరవరంలో శింగం ఏసు మాంసం పకోడీ బండి నిర్వహిస్తున్నాడు. కుమారుడు శివ (16) తండ్రి సాయంగా బండి వద్ద ఉంటుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కొవ్వూరి వీరబాబు అక్కడ మద్యం సేవిస్తూ కూర్చున్నాడు. తనకు పకోడీ తీసుకురావాలని శివకు చెప్పాడు. అయితే పకోడీ తీసుకెళ్లడం కొంచెం ఆలస్యమైంది. దీంతో మద్యం మత్తులో ఉన్న వీరబాబు రెచ్చిపోయాడు.
వెంటనే తన స్కార్పియో వాహనాన్ని తీసుకొచ్చి పకోడీ బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శివకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, వీరబాబు అంతటితో ఆగకుండా కారు దిగి వచ్చి శివను ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో మరిన్ని గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని కాకినాడ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీరవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
768032 62152i was just surfing along and came upon your blog. just wanted to say excellent job and this post genuinely helped me. 813536
403663 524919I actually thankful to find this web site on bing, just what I was searching for : D too bookmarked . 985503
402030 281901conclusion which you are absolutely correct but a couple of call for to be 980330
132469 58821I recognize there exists lots of spam on this blog. Do you want support cleansing them up? I may help amongst courses! 708373