భార్యకు కరోనా లక్షణాలు గుర్తించిన ఓ ప్రభుత్వ వైద్యుడు శాంపిల్స్ ను ఇంట్లో పనిమనిషి పేరుతో పంపించాడు. తీరా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో ఆ అడ్రస్ కు డాక్టర్లు, పోలీసులు రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే.. మొత్తం డాక్టర్ కుటుంబానికే కరోనా పాజిటివ్ రావడంతో వీరందరినీ క్వారంటైన్ కు తరలించారు. డాక్టర్ కోలుకున్నాక చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
అభయ్ రాజన్ సింగ్ మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలోని ఖాతుర్ హెల్స్ సెంటర్ లో ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్నాడు. కరానా విధులు నిర్వహిస్తున్న అభయ్ జూన్ 23న సెలవు పెట్టకుండానే ఉత్తరప్రదేశ్ లోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. జూలై మొదటి వారంలో ఇంటికి తిరిగొచ్చారు. భర్యకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఆమె నమూనాలను ఇంటి పనిమనిషి పేరుతో.. పంపించాడు. రిపోర్ట్స్ పాజిటివ్ రావడంతో అభయ్ రాసిన అడ్రస్ కు వచ్చిన వైద్యులు, పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీంతో అభయ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరిక్షలు నిర్వహించారు. పరిక్షల్లో వీరందరికీ పాజిటివ్ వచ్చింది. వెంటనే వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.
ఫంక్షన్ నుంచి వచ్చాక ఎవరెవరిని కలిసారో పోలీసులు ఎంక్వైరీ చేపట్టగా.. ఒక సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ తో పాటు దాదాపు 33 మంది ప్రభుత్వ అధికారులు కలిసారని గుర్తించారు. దీంతో వీరంతా సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లారు. త్వరలో వీరందరికీ కరోనా పరిక్షలు నిర్వహించనున్నారు. తప్పుడు పేరు, అడ్రస్ తో నమూనాలు పంపినందుకు డాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.