నమ్మకంగా పని చేస్తున్నాడనుకున్న ఉద్యోగి మోసం చేయడంతో యజమాని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. మోసం చేసింది ఉద్యోగి అని తెలియక.. డేటా లీక్ అయిందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేసిన అశోక్ వర్మ, సుధీర్ వర్మ హైదరాబాద్ వచ్చి సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించారు. మాదాపూర్ లోని మైండ్ స్పేస్ లో ‘రిపోర్ట్ గార్డెన్’ పేరుతో వీరిద్దరూ స్థాపించిన కంపెనీలోకి ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ క్రమంలో మియాపూర్ కు చెందిన హుస్సేన్ ను కూడా ఉద్యోగంలోకి తీసుకున్నారు. నమ్మకంగా పని చేస్తూండటంతో కంపెనీ డైరక్టర్ గా బాధ్యతలు అప్పగించారు కూడా. అయితే.. ఇటివల ఈ కంపెనీని విక్రయించాలని అశోక్ వర్మ, సుధీర్ వర్మ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో తన ఉద్యోగానికి ముప్పు వస్తుందని భావించాడు హుస్సేన్. దీంతో కుట్ర పన్ని కంపెనీలో గతంలో పనిచేసిన వారి మెయిల్స్ ద్వారా కంపెనీ కీలక డేటాను లీక్ చేశాడు. అమెరికాలో ఉంటున్న అశోక్ వర్మకు ఈ విషయం తెలసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. డేటా ఎలా లీక్ అయిందనే దానిపై సహ యజమాని సుధీర్ వర్మ, మిగిలిన ఉద్యోగస్థులకు అంతుబట్టకుండా ఉంది.
ఈ నేపథ్యంలో సుధీర్ వర్మ కంప్యూటర్లను పరిశీలించగా హుస్సేన్ పై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా హుస్సేన్ ను అరెస్టు చేశారు. విచారణలో డేటా లీక్ చేసింది తానేనని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
74204 744185I like the way you conduct your posts. Hmm 627205
106304 846048 warning Dont any of you men and women ever take me to CiCis pizza! There food looks offensive!|Urban_Elegance| 808836