తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి. దేశ చరిత్రలో తొలిసారిగా డిస్ ప్లే ఫ్యాబ్ కోసం రూ.24వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఎలెస్ట్ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బెంగళూరులో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తో రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ చైర్మన్ రాజేశ్ మెహతా పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడుల ద్వారా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్ టాప్ వంటి డిస్ ప్లేలను తయారు చేయనుంది.
‘ఎలెస్ట్ పెట్టుబడుల ద్వారా డిస్ ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణ మాత్రమే కాకుండా దేశాన్ని సైతం చైనా, అమెరికా, జపాన్ వంటి కొద్ది దేశాల సరసన నిలబెడుతుంది. భారత్ సెమీకండక్టర్ మిషన్ ప్రకటనతో రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగాన్ని తీసుకొచ్చేందుకు.. పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ ప్లాంట్లో 3వేల మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ చైర్మన్ రాజేశ్ మెహతా అన్నారు.
885805 713839The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as considerably as this 1. I mean, I do know it was my choice to read, nevertheless I truly thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something which you could fix for people who werent too busy in search of attention. 128211