తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు వచ్చేశాయి. శనివారమే చూచాయగా ఫలితాలు ఎలా ఉంటాయో వెల్లడించిన ఆయన.. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్వే వివరాలు వెల్లడించారు. ఏపీలో అధికారం తెలుగుదేశం పార్టీదేనని స్పష్టంచేశారు. టీడీపీకి 90 నుంచి 110 సీట్లు వస్తాయని, వైఎస్సార్ సీపీకి 65 నుంచి 79 స్థానాలు వస్తాయని తెలిపారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు 1 నుంచి 3 స్థానాలు వస్తాయన్నారు.
టీడీపీకి వైఎస్సార్ సీపీ గట్టి పోటీ ఇచ్చిందని, రెండు పార్టీల మధ్య కేవలం 2 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందని పేర్కొన్నారు. జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూ ఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. టీడీపీకి 43 శాతం ఓట్లు వస్తాయని, వైకాపాకు 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని తెలిపారు. లోక్సభ స్థానాల విషయానికొస్తే టీడీపీకి 13 నుంచి 17, వైఎస్సార్సీపీకి 8 నుంచి 12 స్థానాలు రావొచ్చని పేర్కొన్నారు. జనసేనకు సున్నా నుంచి ఒక లోక్సభ స్థానం వచ్చే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు 14 నుంచి 16 లోక్సభ స్థానాలు, కాంగ్రెస్కు 0 నుంచి 2 సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని చెప్పారు. జనవరి నుంచి ఎన్నికల ముందు, తర్వాత నెలనెలా రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేసి, ప్రజల నాడి ఏంటి? మనోగతం ఎలా వుంది? వంటి అంశాల ఆధారంగా తాము ఈ అంచనాలు వేసినట్టు లగడపాటి తెలిపారు.
341366 211900very nice post, i undoubtedly adore this exceptional web site, carry on it 599141
401541 146829wonderful post. Neer knew this, regards for letting me know. 92408
705130 730306The vacation trades offered are evaluated a variety of within the chosen and simply excellent value all about the world. Those hostels are normally based towards households which youll discover accented via charming shores promoting crystal-clear fishing holes, concurrent of ones Ocean. Hotels Discounts 884006