ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన వ్యవహరించిన తీరును వైఎస్సార్ సీపీ నేతలు ఏమాత్రం మరిచిపోలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా వారిని పూర్తికాలం పదవుల్లో కొనసాగేలా చేయడంతోపాటు సభలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే సమయం సరిగా ఇవ్వకపోవడం, రోజాపై సస్పెన్షన్ వ్యవహారం.. ఇలా పలు అంశాలపై వైఎస్సార్ సీపీ నేతల్లో తొలి నుంచీ ఆయనపై తీవ్ర వ్యతిరేకత కొనసాగిస్తూనే ఉంది.
మరోవైపు కోడెలపై గుంటూరు జిల్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఆయన కుమారుడు, కుమార్తెలు సాగించిన దందాలు అన్నీ ఇన్నీ కావు. కే ట్యాక్స్ పేరుతో నియోజకవర్గంలో చాలామంది నుంచి దోచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో వారు సాగించిన అక్రమాలకు బలైన బాధితులు చాలామందే ఉన్నారు. అయితే, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావడం, అధికారులు సైతం వారికే అనుకూలంగా వ్యవహరించడంతో ఎవరూ బయటకు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
తాను 2002లో కొనుగోలు చేసిన భూమికి సంబంధించి కోడెల కుమార్తె విజయలక్ష్మి తనను బెదిరిస్తున్నారని.. తనను, తన భర్తను చంపేస్తారని హెచ్చరించారని పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేశారు. 2002లో తాను ఆ భూమిని కొనుగోలు చేయగా.. ఆ భూమి తనదని పేర్కొంటూ రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో తాము చేసేది లేక రూ.15 లక్షలు విడతలవారీగా చెల్లిస్తామని చెప్పి, ఆ మేరకు వారికి డబ్బులు కూడా ఇచ్చేశామని.. తాజాగా మిగిలిన రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే మరో బిల్డర్ సైతం తనను కోడెల కుమారుడు బెదిరించి డబ్బు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కోడెల కుమార్తె, కుమారుడిపై కేసులు నమోదు చేశారు. వాస్తవానికి గుంటూరు జిల్లాల్లో కోడెల అక్రమాలపై ఆ జిల్లా వాసుల్లో ఆగ్రహావేశాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో వారు ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో వారు తమ కసి తీర్చుకున్నారు. పోలింగ్ బూత్ ఆక్రమించుకుని రిగ్గింగ్ కు ప్రయత్నించారంటూ కోడెలని తరిమి తరిమి కొట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అఖండ విజయంతో గద్దెనెక్కింది. వెంటనే కోడెల పని పట్టే చర్యలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా తొలుత కోడెల కుమార్తె, కుమారుడి అక్రమాలపై దృష్టి పెట్టారు. ముందుగా వారిపై బాధితులతో ఫిర్యాదు చేయించి, ఆనక వారి పని పట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కోడెల కుటుంబం వసూలు చేసిన కే ట్యాక్స్ మొత్తం కక్కిస్తామని, వారికి సహకరించిన అధికారులను సైతం వదిలిపెట్టబోమని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టంచేశారు. కోడెల కుటుంబ బాధితులు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. మొత్తమ్మీద కోడెల కుమార్తె, కుమారుడిని టార్గెట్ చేసుకోవడం ద్వారా ఆయన్ను కార్నర్ చేయాలన్నది వైఎస్సార్ సీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
Related Posts
చంద్రబాబుని తిడితే లాభమేంటి మోడీజీ!
206616 62909Quite very good post, thanks a good deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 53959
69214 49190An extremely intriguing read, I may possibly not agree completely, but you do make some very valid points. 178762