Switch to English

జగన్‌ 2.0: రోజాకి ‘హోంమంత్రి’ పదవి దక్కేనా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నగిరి ఎమ్మెల్యే రోజా రాజకీయ భవిష్యతపై చాలా చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ తన మంత్రి వర్గంలో రోజాకి అవకాశమిస్తారనే ప్రచారం జరిగింది. నిజానికి, 2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక, ఆయన్నుంచే రోజా ‘మంత్రి పదవి హామీ’ పొందారంటారు చాలామంది. ఆ హామీతోనే ఆమె టీడీపీని వీడి, వైసీపీలో చేరారు. అయితే అప్పటినుంచి, ఇప్పటిదాకా.. అంటే సుమారు పదేళ్ళపాటు ఆమె మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన రోజా, ఇటీవలి ఎన్నికల్లో ఇంకోసారి ఘనవిజయాన్ని అందుకున్న విషయం విదితమే. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌లో రోజాకి చోటు దక్కకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. వైసీపీ ముఖ్య నేతలే ఆశ్చర్యపోయారు ఈ విషయంలో. అయితే, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలోనే రోజాకి మంత్రి పదవి దక్కలేదన్న వాదన వుంది.

అయితే, రోజాకి మంత్రి పదవి ఇస్తే కాదనేవారెవరు? కావాలనే వైఎస్‌ జగన్‌, రోజాని తొక్కిపెట్టారన్న విమర్శలు ఓ పక్క గట్టిగా విన్పిస్తున్నాయి. అయితే, తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో షాక్‌కి గురైన రోజా, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. ఆమెతో మాట్లాడి, కీలక పదవి ఇస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పారంటూ ప్రచారం జరుగుతున్నా, అలాంటిదేమీ లేదనే లీకులు మీడియాకి రోజా సన్నిహితుల నుంచి అందుతున్నాయి.

‘అసలు వైఎస్‌ జగన్‌, రోజాని పట్టించుకోవడంలేదు. దారుణంగా వెన్నుపోటు పొడిచారు రోజాకి’ అంటూ రోజా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో రోజాకి కీలకమైన శాఖ దక్కవచ్చునని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నా, అప్పటికి పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ ఎలా మారతాయో తెలియని పరిస్థితి.

ఈ నేపథ్యంలో రోజా, తన రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు కొందరు. అయితే, వైఎస్‌ జగన్‌ని కాదని ఇప్పుడు రోజా రాజకీయంగా ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశమూ లేదన్నది మరికొందరి వాదన. తాజా గాసిప్‌ ఏంటంటే, రెండున్నరేళ్ళ తర్వాత మారనున్న మంత్రి వర్గ కూర్పులో భాగంగా రోజాకి హోంమంత్రి పదవి రావొచ్చంటూ వైసీపీ నుంచి కొన్ని లీకులు బయటకొస్తున్నాయి.

మొదటిసారికి దిక్కులేదుగానీ, రెండోసారికి ఉద్ధరించేస్తారట.. అన్నట్టుంది వ్యవహారం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు జగన్‌ క్యాబినెట్‌లో వున్న చాలామంది కంటే రోజా అత్యంత సమర్థురాలు, జగన్‌కి అత్యంత నమ్మకస్తురాలు కూడా. కానీ, ఆమె వెన్నుపోటుకు గురయ్యింది. ‘అతిగా నమ్మడమే నేను చేసిన నేరమా?’ అని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

Related Posts

రోజాకు ఆ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా ?

రోజాకి జబర్‌దస్త్‌ వెన్నుపోటు.. పొడిచిందెవరు?

వైఎస్ జగన్ క్యాబినెట్: తండ్రి బాటలోనే తనయుడు..

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...