Switch to English

చంద్రబాబుని తిడితే లాభమేంటి మోడీజీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

2014లో చంద్రబాబు – నరేంద్ర మోడీ మిత్రులు. చంద్రబాబు సమర్ధతను నాలుగేళ్ళపాటు కొనియాడిన ఘనుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీని భుజాన మోసిన వీర విధేయుడు చంద్రబాబు. అయితే, అదంతా గతం. నాలుగేళ్ళ తర్వాత లెక్కలు మారిపోయి చంద్రబాబు – నరేంద్ర మోడీ బద్ద శతృవులైపోయారు. నరేంద్ర మోడీ తిరిగి అధికారం దక్కించుకుంటే, చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు.

చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లను గెల్చుకున్నారు. మరి, నరేంద్ర మోడీ సంగతేంటి? పూర్తిగా సున్నా చుట్టేసింది భారతీయ జనతా పార్టీ. ‘కొందరు ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు’ అని నరేంద్ర మోడీ, నిన్న తిరుపతి పర్యటనలో చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. తిరిగి సెటైర్లు వేసే పరిస్థితుల్లో చంద్రబాబు అండ్‌ టీమ్‌ లేదుగానీ, ‘రాష్ట్ర ప్రజలు మీకు గుండు కొట్టేశారు కదా.. ఏ మొహొ పెట్టుకుని మళ్ళీ వచ్చారు.?’ అని ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటట? తిరుపతిలోనే నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.

ఆ తిరుపతి వెంకటేశ్వరుడి దయతోనే రెండోసారి ప్రధాని అయ్యానంటున్న నరేంద్ర మోడీ, ప్రత్యేక హోదా విషయంలో వెంకన్న పాదాల వద్ద ఇచ్చిన హామీని విస్మరించడం హాస్యాస్పదం. 2014లో చంద్రబాబుని పొగిడినట్లే, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నరేంద్ర మోడీ పొగుడుతున్నారు. ఓ వైపు పొగడటం, ఇంకో వైపు రాజకీయంగా దెబ్బ కొట్టడం కమల దళానికి అలవాటైన వ్యవహారమే.

తిరుపతి పర్యటనలో ప్రధాని హోదాలో ఆంధ్రప్రదేశ్‌కి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ని కూడా నరేంద్ర మోడీ ప్రకటించకపోవడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తిరస్కరించారు కాబట్టి, వారికి ఇంకేమీ చెయ్యక్కర్లేదు’ అన్న భావనలో నరేంద్ర మోడీ సర్కార్‌ వుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్‌ జగన్‌ని అభినందించడం, ఆయన సమర్థతను కొనియాడటం వెనుక బీజేపీకి వేరూ వ్యూహాలున్నాయి. అవేంటో గతంలో చంద్రబాబు విషయంలో మోడీ పొగడ్తలతోనే అందరికీ అర్థమయ్యింది.

కానీ, ఇప్పుడు తిరుపతికి మోడీ వచ్చింది ఎందుకు? చంద్రబాబుని తిట్టడానికా? మోడీ మాత్రమే కాదు, ఏపీ బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు కూడా చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. నరేంద్ర మోడీ మెప్పు కోసం. కొత్తగా కేంద్ర సహాయ మంత్రి అయిన కిషన్‌ రెడ్డిది కూడా అదే తీరు. ముగ్గురు ఎంపీలతో, 23 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబు తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి లేదు. అలాంటిది, ఆయన్ని టార్గెట్‌ చేసి, బీజేపీ ఏం సాధిద్దామనుకుంటోందో ఏమో!

ఒక్కటైతే నిజం, చంద్రబాబుని తిట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ మైలేజీ పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇలాంటి వ్యూహంతో చంద్రబాబు, నరేంద్ర మోడీనీ.. కేసీఆర్‌నీ తిట్టి.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసుకున్న విషయం విదితమే.

Related Posts

మోడీకి వంగి వంగి దండాలెట్టాలా వైఎస్‌ జగనూ!

సీఎం జగన్‌కి తొలి షాక్‌: బాబు, మోడీ ఒక్కటయ్యారా?

గవర్నర్ నరసింహన్ ఇన్నింగ్స్ కు ముగింపు

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...