2014లో చంద్రబాబు – నరేంద్ర మోడీ మిత్రులు. చంద్రబాబు సమర్ధతను నాలుగేళ్ళపాటు కొనియాడిన ఘనుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీని భుజాన మోసిన వీర విధేయుడు చంద్రబాబు. అయితే, అదంతా గతం. నాలుగేళ్ళ తర్వాత లెక్కలు మారిపోయి చంద్రబాబు – నరేంద్ర మోడీ బద్ద శతృవులైపోయారు. నరేంద్ర మోడీ తిరిగి అధికారం దక్కించుకుంటే, చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు.
చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో 23 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లను గెల్చుకున్నారు. మరి, నరేంద్ర మోడీ సంగతేంటి? పూర్తిగా సున్నా చుట్టేసింది భారతీయ జనతా పార్టీ. ‘కొందరు ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు’ అని నరేంద్ర మోడీ, నిన్న తిరుపతి పర్యటనలో చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. తిరిగి సెటైర్లు వేసే పరిస్థితుల్లో చంద్రబాబు అండ్ టీమ్ లేదుగానీ, ‘రాష్ట్ర ప్రజలు మీకు గుండు కొట్టేశారు కదా.. ఏ మొహొ పెట్టుకుని మళ్ళీ వచ్చారు.?’ అని ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటట? తిరుపతిలోనే నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.
ఆ తిరుపతి వెంకటేశ్వరుడి దయతోనే రెండోసారి ప్రధాని అయ్యానంటున్న నరేంద్ర మోడీ, ప్రత్యేక హోదా విషయంలో వెంకన్న పాదాల వద్ద ఇచ్చిన హామీని విస్మరించడం హాస్యాస్పదం. 2014లో చంద్రబాబుని పొగిడినట్లే, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ పొగుడుతున్నారు. ఓ వైపు పొగడటం, ఇంకో వైపు రాజకీయంగా దెబ్బ కొట్టడం కమల దళానికి అలవాటైన వ్యవహారమే.
తిరుపతి పర్యటనలో ప్రధాని హోదాలో ఆంధ్రప్రదేశ్కి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్ట్ని కూడా నరేంద్ర మోడీ ప్రకటించకపోవడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు కాబట్టి, వారికి ఇంకేమీ చెయ్యక్కర్లేదు’ అన్న భావనలో నరేంద్ర మోడీ సర్కార్ వుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్ జగన్ని అభినందించడం, ఆయన సమర్థతను కొనియాడటం వెనుక బీజేపీకి వేరూ వ్యూహాలున్నాయి. అవేంటో గతంలో చంద్రబాబు విషయంలో మోడీ పొగడ్తలతోనే అందరికీ అర్థమయ్యింది.
కానీ, ఇప్పుడు తిరుపతికి మోడీ వచ్చింది ఎందుకు? చంద్రబాబుని తిట్టడానికా? మోడీ మాత్రమే కాదు, ఏపీ బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు కూడా చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. నరేంద్ర మోడీ మెప్పు కోసం. కొత్తగా కేంద్ర సహాయ మంత్రి అయిన కిషన్ రెడ్డిది కూడా అదే తీరు. ముగ్గురు ఎంపీలతో, 23 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి లేదు. అలాంటిది, ఆయన్ని టార్గెట్ చేసి, బీజేపీ ఏం సాధిద్దామనుకుంటోందో ఏమో!
ఒక్కటైతే నిజం, చంద్రబాబుని తిట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇలాంటి వ్యూహంతో చంద్రబాబు, నరేంద్ర మోడీనీ.. కేసీఆర్నీ తిట్టి.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసుకున్న విషయం విదితమే.
Related Posts
మోడీకి వంగి వంగి దండాలెట్టాలా వైఎస్ జగనూ!
847658 707401Basically a smiling visitant here to share the love (:, btw outstanding pattern . 344301
808987 238547Thank you for this. Thats all I can say. You most certainly have made this into something thats eye opening and important. You clearly know so a lot about the subject, youve covered so numerous bases. Excellent stuff from this part of the internet. 364074
491052 546030Great information many thanks sharing and reaching us your subscriber list. 321638