జబర్దస్త్ తో ఫేమ్ సంపాదించిన కిరాక్ ఆర్పీ… ఆ కామెడీ షో నుండి బయటకు వచ్చి తర్వాత అదిరిందిలో చేసిన విషయం తెల్సిందే. ఇక ఈ మధ్య జబర్దస్త్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు ఆర్పీ. అవి సంచలనం అయ్యాయి కూడా. ఇక కట్ చేస్తే ఇప్పుడు చేపల పులుసు బిజినెస్ పెట్టి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు.
కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రీ పాయింట్ ను పెట్టి రోజుకి ఏకంగా 2 లక్షలపైన బిజినెస్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. నెల్లూరు నుండే చేపలను తెచ్చి నాటు స్టైల్ లో కట్టెల పొయ్యి మీద చేపల పులుసు వండిస్తున్నాడు. ఈ కర్రీ పాయింట్ పెట్టి వారమే దాటింది. అయితే ఇప్పటికే రెస్పాన్స్ సూపర్బ్ గా వస్తోంది.
కిలోమీటర్ల మేర క్యూలైన్… కర్రీ పాయింట్ ను వచ్చే ప్రజలను నియంత్రించడానికి బౌన్సర్లను కూడా నియమించేటంత సక్సెస్ అయ్యింది ఈ కర్రీ పాయింట్. మొత్తానికి కిరాక్ ఆర్పీ పెట్టిన ఈ చేపల పులుసు కర్రీ పాయింట్ అందరినీ ఆకర్షించింది.
633229 590552really nice put up, i in fact love this internet website, keep on it 13634
923307 62765I like this weblog so much, saved to my bookmarks . 137069