ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం విషయమై అధికార వైసీపీ ఎంతలా మొండికేస్తోందో చూస్తూనే వున్నాం. అక్కడికేదో, ఇంగ్లీషు మీడియంలో చదవకపోతే అసలు భవిష్యత్తే లేదన్నట్టు వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది.
జాతీయ స్థాయి పోటీ పరీక్షలు కూడా తెలుగులో జరుగుతున్న రోజులివి. మాతృభాషలో విద్యాబోధన వల్లే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారనీ, ఆయా రంగాల్లో రాణించగలుగుతారనీ జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలో పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా దేశాల్లోని ప్రభుత్వాలు అక్కడి విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నాయి.
ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు కొత్తగా ‘ట్యాబ్’లంటోంది వైసీపీ సర్కారు. విద్యార్థులకు ట్యాబ్లు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. బైజూస్ సంస్థ ద్వారా పాఠాలకు సంబంధించిన కంటెంట్ని కూడా అందిస్తారట. దీనికోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
నిజానికి, విద్య మీద ఎంత ఖర్చు చేసినా ఆహ్వానించాల్సిందే. కానీ, ఆ ఖర్చు సద్వినియోగమవుతోందా.? దుర్వినియోగమవుతోందా.? అన్నదే కీలకం ఇక్కడ. ఒక్కో ట్యాబ్ ధర సుమారు 13 వేలుగా వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. కానీ, అదే ట్యాబ్ ఆన్లైన్లో 12 వేల రూపాయల లోపే లభ్యమవుతోంది. మరి, ప్రభుత్వమెందుకు అధిక ధరకు ట్యాబ్లను కొనుగోలు చేస్తోంది.
సుమారు 5 లక్షల ట్యాబ్లు కొనుగోలు చేయడమంటే, బల్క్గా చూసుకున్నప్పుడు ఆ ధర 10 వేల లోపుకే తగ్గినా ఆశ్చర్యమేమీ వుండదు. కానీ, 13 వేల పైన వెచ్చిస్తోంతి వైసీపీ సర్కారు. ఇదే విషయపై టీడీపీ నేత పట్టాభి మీడియా సాక్షిగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇంతకీ, ట్యాబ్ల కొనుగోలు వెనుక విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడి వున్నాయా.? అధికార పార్టీ ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి వున్నాయా.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి.!
398564 486855Really instructive and superb structure of articles, now thats user friendly (:. 60680
835132 848901Woh I like your posts , saved to fav! . 759536