‘తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..’ అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం..’ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కానీ, ‘నీటి సమస్యల పరిష్కారం’ కోసమంటూ కేసీఆర్, వైఎస్ జగన్.. ఒకర్నొకరు కౌగలించుకున్నారు.. ఈ స్నేహం ఎప్పటికీ చెరిగిపోనిది.. అంటూ పండగ చేసుకున్నారు. ‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణతో గొడవలు పెట్టుకున్నారు.. మేం మాత్రం, తెలంగాణతో సఖ్యతగా వుంటూ.. రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాం..’ అని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. ఆ సఖ్యత ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అందరికీ.
రాయలసీమ నీటి సమస్యల్ని తీర్చే ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడితే, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాంతో, కేసీఆర్కి ఒళ్ళు మండింది.! నిజంగానే మండిందా.? మండినట్లు నటిస్తున్నారా.? ఏమోగానీ, విషయం ముదిరి పాకాన పడినట్లు కన్పిస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్తో గొడవల్ని మేం కోరుకోలేదు. ఇరు రాష్ట్రాలూ కలిసి సంయుక్తంగా నీటి ప్రాజెక్టులు కట్టుకుని.. గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఒడిసిపట్టి, వాడుకుందామనుకున్నాం.. వైఎస్ జగన్ని ఇంటికి పిలిచి, భోజనం పెట్టి మరీ.. విషయాన్ని వివరించాను.. కానీ, ఇప్పుడిలా ఆంధ్రప్రదేశ్ అన్ని విషయాల్లోనూ మాకు అడ్డు తగులుతుందని అనుకోలేదు..’ అంటూ కేసీఆర్ గుస్సా అయ్యారు.
శ్రీశౖలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి వాడకంపై రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది. నిజానికి, ఇది కొత్త తగాదా కాదు.. పాతదే. కాస్త కొత్తగా హైలైట్ అవుతోంది. కరోనా విషయంలో అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. నానా రకాల విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ.. వివిధ అంశాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. దాన్నుంచి తప్పించుకోవడానికే, ఈ ‘జల యుద్ధం’ తెరపైకొచ్చినట్లు కన్పిస్తోంది. లేకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరాలున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి పిలవగానే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ ఎలా వెళ్ళగలిగారు.? పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది మొదటి నుంచీ. ఆ విషయమై సమస్య పరిష్కారమయ్యిందా.? లేదా.? అన్న ప్రశ్నకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వడంలేదు.? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి వైసీపీ తెరవెనుక సహకారం అందించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి టీఆర్ఎస్ సహకరించింది. ఈ బంధం నిజంగానే చాలా బలమైనది. మరి, ఈ గిల్లికజ్జాలేంటి.? అంటారా.! అదే మరి, ‘డైవర్షన్ పాలిటిక్స్’ అంటే.! అన్నట్టు, ఏపీ నోరు మూయించేలా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమాధానం చెబుతామని అంటున్న కేసీఆర్.. మాట మీద నిలబడతారా.? తన విశ్వసనీయతను చాటుకుంటారా.? వేచి చూడాల్సిందే.
551953 637682I saw plenty of website but I think this 1 contains something unique in it in it 976293
376934 133629Some actually superb information , Sword lily I discovered this. 92586
578112 273371An fascinating discussion is worth comment. I believe that you need to write far more on this topic, it might not be a taboo subject but usually men and women are not enough to speak on such topics. To the next. Cheers 702978