దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొందరు అధికారుల తీరు వల్ల ప్రహసనంగా మారింది. ఇప్పటికే వ్యాక్సిన్ పై సామాన్య ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు సైతం స్వయంగా వ్యాక్సిన్ వేయించుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
మనదేశంలో సైతం అధికారులు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదని ప్రకటనలిస్తున్నారు. అయితే, కర్ణాటకలోని తుమ్మూరులో అధికారుల అత్యుత్సాహం అభాసుపాలైంది. తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ సందర్భంగా స్థానిక డీఎంఓ నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్స్ పాల్ రజనీలకు టీకాలు వేయాలి. అయితే, వారిద్దరూ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు. సిబ్బంది సైతం వారిద్దరికీ టీకా ఇవ్వకుండానే ఇస్తున్నట్టుగా నటించారు.
అయితే, ఈ వీడియో ప్రస్తుతం బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైద్యాధికారులకు కూడా వ్యాక్సిన్ పై నమ్మకం లేదా అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే వారిద్దరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
213787 242514Just wanna comment which you have a really nice internet web site , I adore the style it in fact stands out. 974884
42209 44341Interesting point of view. Im curious to think what type of impact this would have globally? Sometimes men and women get a little upset with global expansion. Ill be around soon to look at your response. 178331
765675 977236I think this website has got some quite excellent info for everybody : D. 582776
412980 124640This is how to get your foot in the door. 564278