Switch to English

కర్ణాటక పంచాయతీ తేలింది.. ఏపీది ఎప్పుడో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా కారణంగా వాయిదా పడిన కర్ణాటక పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 22, 27వ తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఫలితాలు 30న వెలువరించనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.

కర్ణాటకలో పంచాయతీల కాలపరిమితి ఈ ఏడాది జూన్ తో ముగిసింది. అయితే, కరోనా కల్లోలం కారణంగా అక్కడ ఎన్నికలను ఎన్నికల సంఘం ఆరు నెలలపాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సమాయత్తం కాగా, పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే, హైకోర్టులో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వెలువడింది. అనంతరం సుప్రీంకోర్టు సైతం దానిని సమర్థించింది. దీంతో ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

ప్రస్తుతం కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ మొగ్గు చూపడం విశేషం. ఇక ఏపీ విషయానికొస్తే కరోనా సాకు చూపించి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అధికార పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో ఉన్న విభేదాల కారణంగానే వైసీపీ ఇలా వ్యవహరిస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై గత కొంతకాలంగా ఏపీ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్టుగా పోరు సాగుతోంది.

ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో ఉంది. ఇప్పటికే తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతుండగా.. పలు రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. కానీ ఏపీ సర్కారు మాత్రం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్దేశిత కాలం మేరకు వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంచేసింది.

‘‘రాష్ట్రంలో ఏవైనా అసాధారణ పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది ఎస్ఈసీ ప్రత్యేకంగా నిర్ణయించాల్సిన అంశం. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అయితే, రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశాన్ని ఎస్ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చు’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అంటే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలా.. వద్దా అనే విషయం పూర్తిగా ఎస్ఈసీ పరిధిలోనేనని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో సైతం ఇదే తరహా తీర్పు వెలువడుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...