ఏపీలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో గతేడాది.. పలు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా జస్టిస్ కనగరాజ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఎస్ఈసీగా నియామకమై హైకోర్టు అదేశంతో పదవి కోల్పోయారు కనగరాజ్.
పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల ఫిర్యాదులు స్వీకరించకపోయినా, సకాలంలో వారికి న్యాయం లభించకపోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పీసీఏలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్తోపాటు ఓ స్వచ్ఛంధ సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా వుంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి పోలీసులు బాధ్యులుగా తేలితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. పీసీఏ సిఫారసులను అమలు చేయాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
67486 321481You must participate in a contest for among the top blogs on the internet. I will suggest this internet site! 93212
156984 589627Fantastic post man, keep the nice work, just shared this with the friendz 126714