జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది. జనసేన పార్టీ స్థానంలో ‘మైక్రో స్ట్రాటజీ’ అనే పేరు దర్శనమిస్తోంది.
దీంతోపాటు అందులో ఉన్న కంటెంట్ కి థంబ్ నైల్స్ కూడా మారిపోయాయి. ఇందులో కొన్ని వీడియోస్ ని క్లిక్ చేయగానే మైక్రో స్ట్రాటజీ అధికారిక ఛానల్ ఓపెన్ అవుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ కి 14 లక్షల సబ్స్క్రైబ్ ఉన్నారు.
మరి కొన్ని రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ కి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు జనసేన పార్టీ యూట్యూబ్ అకౌంట్ కూడా హ్యాక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.