ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వారం రోజుల్లోనే తన మార్కు పాలన చూపించారు. పలు విషయాల్లో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎంతో పరిణితి కలిగిన నేతగా ఒక్కోటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక పింఛన్ల పెంపు నుంచి 4 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, ఆశా వర్కర్ల వేతనాల పెంపు, అక్టోబర్ 15 నుంచి రైతుభరోసా పథకం అమలు.. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుమతి.. కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. అన్ని వర్గాలూ, ప్రాంతాలకు ప్రాతినిధ్యం.. అవినీతి లేని పాలన అందించాలనే సంకల్పం.. ఇలా అత్యంత దూకుడుగా దూసుకెళ్తున్నారు. ఇ
క జగన్ ప్రసంగం స్టైల్ కూడా మారింది. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా అన్న రీతిలో చెప్పేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ప్రసంగాలు చాలా సుదీర్ఘంగా సాగేవి. తెలంగాణ సీఎం కేసీఆర్ అంత మాటకారి కాకపోవడం, సందర్భానుసారం సెటైర్లు వేయడం వంటివి లేకపోవడంతో అప్పట్లో ఆయన ప్రసంగాలు బోర్ కొట్టించేవి. కానీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తీరు మారింది. అయితే, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన కాస్త ఎక్కువసేపే మాట్లాడారు. అంతేకాకుండా వేదికపై నుంచి మీడియాను బెదిరించే రీతిలో మాట్లాడటం కొన్ని వర్గాల్లో విమర్శలకు తావిచ్చింది. ఆ సందర్భంలో మీడియా గురించి ప్రస్తావించాల్సిన అవసరంలేదనే వ్యాఖ్యలు వినిపించాయి.
అప్పటివరకు తనను వేధించిన మీడియా సంస్థలపై ఉన్న ఆగ్రహాన్ని ఆ సందర్భంగా ప్రస్తావించారని, అందులో ఎలాంటి తప్పూ లేదని కొంతమంది సమర్థించినా.. మీడియా సంస్థల పేరు పెట్టి మరీ విమర్శించడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రెండు పత్రికలు అంటూ మాట్లాడేవారు. రెండోసారి సీఎంగా ఎన్నికైన తర్వాత.. ఈ మీడియా సంస్థల ప్రవర్తనకు తగినట్టుగానే తమ స్పందన ఉంటుందని చెప్పారు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. అయితే, ఆ తర్వాత జగన్ తీరులో కూడా చాలా స్పష్టమైన మార్పు వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ మీడియా సంస్థల ప్రస్తావన తీసుకురాలేదు. పైగా ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నారు.
తాజాగా శుక్రవారం తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్పీ సమావేశంలో 150 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ కేవలం 12 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇంత తక్కువ సమయంలోనే ఆయన చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు. తన కేబినెట్ ఎలా ఉండబోతోంది, ఏయే వర్గాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నాను, డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉండబోతున్నారు, ఈ మంత్రుల పదవీకాలం ఎంత, రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ పునర్వవస్థీకరణ ఏ ప్రాతిపదిక చేయబోతున్నాను వంటి విషయాలు స్పష్టంగా చెప్పారు. అవినీతి లేని పాలన అందించడమే తన లక్ష్యమని, ఆ దిశగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మంత్రులుగా అవకాశం రానివారికి భవిష్యత్తులో అవకాశం ఇస్తానని, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో సమావేశం ముగిసిన తర్వాత బయటకు వస్తున్న ఎమ్మెల్యేలంతా చాలా ఖుషీగా కనిపించారు. మొత్తమ్మీద జగన్ అటు ప్రజలతోపాటు ఇటు ఎమ్మెల్యేలను కూడా ఆకట్టుకున్నారన్న మాట.
556504 839129 Nice post. I learn something more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice slightly something from their store. Id prefer to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a link on your internet blog. Thanks for sharing. 680918