Switch to English

జగన్ ప్రసంగం: సూటిగా.. సుత్తి లేకుండా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వారం రోజుల్లోనే తన మార్కు పాలన చూపించారు. పలు విషయాల్లో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎంతో పరిణితి కలిగిన నేతగా ఒక్కోటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక పింఛన్ల పెంపు నుంచి 4 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, ఆశా వర్కర్ల వేతనాల పెంపు, అక్టోబర్ 15 నుంచి రైతుభరోసా పథకం అమలు.. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుమతి.. కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. అన్ని వర్గాలూ, ప్రాంతాలకు ప్రాతినిధ్యం.. అవినీతి లేని పాలన అందించాలనే సంకల్పం.. ఇలా అత్యంత దూకుడుగా దూసుకెళ్తున్నారు. ఇ

క జగన్ ప్రసంగం స్టైల్ కూడా మారింది. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా అన్న రీతిలో చెప్పేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ప్రసంగాలు చాలా సుదీర్ఘంగా సాగేవి. తెలంగాణ సీఎం కేసీఆర్ అంత మాటకారి కాకపోవడం, సందర్భానుసారం సెటైర్లు వేయడం వంటివి లేకపోవడంతో అప్పట్లో ఆయన ప్రసంగాలు బోర్ కొట్టించేవి. కానీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తీరు మారింది. అయితే, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన కాస్త ఎక్కువసేపే మాట్లాడారు. అంతేకాకుండా వేదికపై నుంచి మీడియాను బెదిరించే రీతిలో మాట్లాడటం కొన్ని వర్గాల్లో విమర్శలకు తావిచ్చింది. ఆ సందర్భంలో మీడియా గురించి ప్రస్తావించాల్సిన అవసరంలేదనే వ్యాఖ్యలు వినిపించాయి.

అప్పటివరకు తనను వేధించిన మీడియా సంస్థలపై ఉన్న ఆగ్రహాన్ని ఆ సందర్భంగా ప్రస్తావించారని, అందులో ఎలాంటి తప్పూ లేదని కొంతమంది సమర్థించినా.. మీడియా సంస్థల పేరు పెట్టి మరీ విమర్శించడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రెండు పత్రికలు అంటూ మాట్లాడేవారు. రెండోసారి సీఎంగా ఎన్నికైన తర్వాత.. ఈ మీడియా సంస్థల ప్రవర్తనకు తగినట్టుగానే తమ స్పందన ఉంటుందని చెప్పారు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. అయితే, ఆ తర్వాత జగన్ తీరులో కూడా చాలా స్పష్టమైన మార్పు వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ మీడియా సంస్థల ప్రస్తావన తీసుకురాలేదు. పైగా ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నారు.

తాజాగా శుక్రవారం తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్పీ సమావేశంలో 150 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ కేవలం 12 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇంత తక్కువ సమయంలోనే ఆయన చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు. తన కేబినెట్ ఎలా ఉండబోతోంది, ఏయే వర్గాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నాను, డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉండబోతున్నారు, ఈ మంత్రుల పదవీకాలం ఎంత, రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ పునర్వవస్థీకరణ ఏ ప్రాతిపదిక చేయబోతున్నాను వంటి విషయాలు స్పష్టంగా చెప్పారు. అవినీతి లేని పాలన అందించడమే తన లక్ష్యమని, ఆ దిశగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మంత్రులుగా అవకాశం రానివారికి భవిష్యత్తులో అవకాశం ఇస్తానని, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో సమావేశం ముగిసిన తర్వాత బయటకు వస్తున్న ఎమ్మెల్యేలంతా చాలా ఖుషీగా కనిపించారు. మొత్తమ్మీద జగన్ అటు ప్రజలతోపాటు ఇటు ఎమ్మెల్యేలను కూడా ఆకట్టుకున్నారన్న మాట.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...