Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్ గా కృతి శెట్టి లు నటించిన విషయం తెలిసిందే. 2021 ఫిబ్రవరిలో విడుదల అయిన ఉప్పెన సినిమా అప్పట్లో వంద కోట్లకు పైగా వసూల్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.
సినిమాతో పరిచయం అయిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి మరియు బుచ్చిబాబు బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఉప్పెన సినిమా హిందీ రీమేక్ చేయబోతున్నట్లు బోనీ కపూర్ ప్రకటించాడు. ఇటీవల రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ప్రారంభోత్సవంలో బోనీ కపూర్ పాల్గొన్నాడు. ఆ సమయంలోనే ఉప్పెన రీమేక్ పై స్పందించాడు.
ఉప్పెన సినిమాను తన చిన్న కూతురు ఖుషీ కపూర్ ను చూడమని చెప్పాను. రీమేక్ కు ఏర్పాట్లు చేస్తున్నాను. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతామని అన్నారు. హిందీ వర్షన్ కి సుకుమార్, బుచ్చిబాబు రచన సహకారం అందించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు లో సూపర్ హిట్ అయిన పలు సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. కనుక హిందీ ఉప్పెన కూడా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.