దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు నిరాకరించిన ఘటన సంచలనం రేపింది. దీనికై కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్వయంగా తానే విచారణ జరుపుతున్నట్టు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే..
మే 7న రాంచి నుంచి దివ్యాంగ చిన్నారి ఉన్న కుటుంబం హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చింది. అయితే.. బాలుడు విమానం ఎక్కేందుకు సంస్థ అనుమతివ్వలేదు. దీంతో వారు ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఘటనను తోటి ప్రయాణికురాలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఇండిగో సిబ్బంది బాలుడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొంది.
దీనిపై సంస్థ స్పందిస్తూ.. చిన్నారి భయపడ్డాడని.. అతడి భయం పోతే ప్రయాణానికి అనుమతిచ్చేందుకు ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది వేచి చూశారని పేర్కొంది. అలా జరక్కపోవడం వల్ల వారికి ఇబ్బంది లేకుండా హోటల్ లో బస ఏర్పాటు చేసినట్టు తెలిపింది. మరునాడు ఉదయం వారు వేరే విమానంలో హైదరాబాద్ వెళ్లారని తెలిపింది. నెలకు 75వేల మంది దివ్యాంగులు తమ విమానాల్లో పర్యటిస్తారని పేర్కొంది. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు తెలిపారు.
837982 972388I only wish that I had the ability to convey what I wanted to say in the manner that you have presented this data. Thanks. 378409
686063 293773Whoa! This blog looks just like my old one! It is on a entirely different subject but it has pretty much the same layout and style. Outstanding choice of colors! 129070