ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా.. రాష్ట్రంలో పొలిటికల్ వార్ నడుస్తోంది. పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం, బాదుడే బాదుడు కార్యక్రమంతో చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఓట్లు చీలొద్దని పవన్ కల్యాణ్, అధికారంలోకి తామే వస్తామంటూ సోము వీర్రాజు.. పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఈక్రమంలో చంద్రబాబు భీమిలి పర్యటనలో పొత్తులపై.. అందరూ కలిసి రావాలనే వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి.
దీంతో టీడీపీ-జనసేన మళ్లీ కలిసి వెళ్లబోతున్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ ను అడగాలని అన్నారు. తమకు ప్రజలతోనే పొత్తు అని.. జనసేనతోనే పొత్తు ఉందని అన్నారు. కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోమని వ్యాఖ్యానించారు. దీంతో.. పవన్, చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో పరిస్థితులను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోందని అర్ధమవుతోంది. రాబోయే రోజుల్లో పవన్, చంద్రబాబే తమ పొత్తుపై సమాధానం చెప్పాల్సి ఉంది
896755 216320Thank you for your quite very good information and feedback from you. car dealers in san jose 548073
294501 840076Im impressed, I should say. Genuinely rarely do you encounter a weblog thats both educative and entertaining, and let me let you know, you might have hit the nail about the head. Your concept is outstanding; ab muscles something that too couple of people are speaking intelligently about. Im delighted i discovered this in my hunt for something about it. 882809