Switch to English

ఇద్దరు పిల్లలను కాపాడిన ఐఏఎస్ సంకల్పం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,442FansLike
57,764FollowersFollow

ముంబైలో మూడున్నరేళ్ల పిల్లాడు. ఆటిజంతో బాధపడుతున్నాడు. ఒంటె పాలు, కొన్ని రకాల పప్పులు మాత్రమే ఆహారం. ఇంక ఏం పెట్టినా పడదు. లాక్ డౌన్ నేపథ్యంలో భారత్ లో రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. దీంతో ఆ పిల్లాడి ఇంట్లో ఉన్న ఒంటెపాలు ఇంక నాలుగు రోజులకు మించి రావు. ముంబైలో ఎక్కడా దొరకడంలేదు. రాజస్థాన్ లోని సద్రి నుంచి తేవడం ఒక్కటే మార్గం. కానీ లాక్ డౌన్ లో అదెలా సాధ్యం? ఒంటె పాలు లేకపోతే ఆ పిల్లాడి ప్రాణాలకే ముప్పు. దీంతో ఆ పిల్లాడి తల్లి నేహా సిన్హా వెంటనే ఈ విషయాన్ని వివరిస్తూ ప్రధానికి ట్వీట్ చేసింది. అనంతరం ఇది రీట్వీట్ అవుతూ చాలామందిని చేరింది.

ఒడిశాలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న అరుణ్ బోత్రా దీనిని చూశాడు. రాజస్థాన్ కే చెందిన ఆయన.. ఎలాగైనా ఆ పిల్లాడిని కాపాడాలని భావించారు. వెంటనే ఫోన్ తీసుకున్నారు. తనకు ఉన్న పరిచయాల ద్వారా రాజస్థాన్ సద్రిలోని ఒంటెపాల వ్యాపారులను కాంటాక్ట్ చేశారు. వారు పాలు పంపించడానికి ఓకే చెప్పారు. మరి అక్కడి నుంచి ముంబై రావాలంటే ఎలా? వెంటనే రైల్వేలో ఉన్నతాధికారిగా ఉన్న తన స్నేహితుడు తరుణ్ జైన్ ను సంప్రదించారు. ప్రస్తుతం లూథియానా నుంచి ముంబైకి ఓ పార్సిల్ ట్రైన్ వెళ్లనుందని, పాలు తీసుకొచ్చి తనకు అందజేస్తే దానిని ముంబై చేరుస్తామని హామీ ఇచ్చారు.

వెంటనే పాల వ్యాపారికి ఫోన్ చేయగా.. తమకు ఫాల్నా స్టేషన్ దగ్గర అని, అక్కడకు తీసుకొచ్చి పాలు అందజేస్తానని చెప్పాడు. అయితే, ఆ ట్రైన్ కి ఫాల్నా స్టేషన్ లో స్టాప్ లేదు. కానీ రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో స్పందించారు. పాల పార్సిల్ తీసుకోవడానికి ఫాల్మా స్టేషన్ లో రైలు ఆపేందుకు అనుమతి ఇచ్చారు. అంతే.. సదరు పాలవ్యాపారి 20 లీటర్ల పాలు,15 కిలోల పాలపొడి తీసుకుని వచ్చి ఫాల్నా స్టేషన్ లో ఇవ్వడం.. అది ముంబైలోని ఆ పిల్లాడి ఇంటికి చేరడం చకచకా జరిగిపోయాయి.

సరిగ్గా ఇక్కడే మరో సంఘటన జరిగింది. తమ పిల్లాడికి కూడా ఒంటెపాలు కావాలని, తనకూ సాయం చేయాలని ముంబైకి చెందిన మరో మహిళ కోరింది. కానీ అప్పటికే ట్రైన్ ముంబై వచ్చేయడంతో ప్రస్తుతానికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో నేహా సిన్హా ముందుకొచ్చారు. బిడ్డ ఎవరికైనా బిడ్డే కాదా? 5 లీటర్ల పాలు, 5 కిలోల పాలపొడి ఆ తల్లికి ఇస్తానని పేర్కొన్నారు. అదీ తల్లి మనసంటే. మొత్తమ్మీద ఓ అధికారి సంకల్పం ఇద్దరి పిల్లల ప్రాణాలను కాపాడింది. దీంతో అటు అరుణ్ బోత్రాకు, ఇటు రైల్వే అధికారులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...