క్షణకావేశం విచక్షణని చంపేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువ భాగం ఆ సమయంలో జరిగేవే. అలా ఓ వ్యక్తి ఆవేశంలో చేసిన పని అతని ప్రాణాల మీదకే తెచ్చింది. భార్య మీద కోపంతో ఓ వ్యక్తి నల్లపూసల దండని మింగేశాడు. మూడు నెలలపాటు దండతో పాటు రహస్యాన్ని కూడా కడుపులోనే దాచుకున్నాడు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకెళ్తే..
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి మూడు నెలల క్రితం తన భార్యతో గొడవపడ్డాడు. ఆ కోపం లో ఆమె నల్లపూసల దండ మింగేశాడు. ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంచాడు. రెండు రోజుల క్రితం అతనికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా అక్కడ వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో అనంతపురంలోని సర్వజన ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ వైద్యులు పరీక్షించి అన్నవాహిక వద్ద నల్లపూసల దండ డాలర్ ఇరుక్కోవడానికి గమనించారు.
దీనిపై రామాంజనేయులు ని ప్రశ్నించగా తానే నల్లపూసల దండ మింగేశానని చెప్పాడు. అది కడుపులో ఫుడ్ పైప్ వరకు వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ లేకుండా ఆ దండని బయటకు తీసేందుకు వైద్యులు నిర్ణయించారు. ఫ్లెక్సిబుల్ గ్యాస్ట్రో ఎండోస్కోపి ద్వారా ఆ దండను బయటకు తీశారు. ప్రస్తుతం రామాంజనేయులు పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.