అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు లో నోట్ల కట్టలు పారుతున్నాయి. ఎక్కడికక్కడ భారీగా నగదు పట్టుబడుతోంది. నగదుతోపాటు భారీగా వెండి, బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.264 కోట్ల నగదును పట్టుకున్నారు. బుధవారం రోడ్డు పక్కన బియ్యం సంచిలో రూ.కోటి నగదు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. కొత్తగా పార్టీ పెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ సన్నిహితుల నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
మక్కల్ నీది మయ్యం పార్టీ తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి , కమల్ సన్నిహితుడు లేరోన్ మొర్సాయి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి దాదాపు రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మొత్తమ్మీద కమల్ పార్టీకి చెందిన ప్రముఖుల నుంచి రూ.22.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చెన్నై పల్లవరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు ఒక కారులో రూ.4 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు గుర్తించారు. ఇక తిరుచ్చిరాపల్లి జిల్లాలో రోడ్డు పక్కన రూ.కోటి దొరకడం చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం రాత్రి తిరుచ్చిరాపల్లి-కరూర్ రహదారిపై రెండు కార్లలోని వ్యక్తులు వాదులాడుకుంటుండగా అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చారు. దీంతో వారిని చూడగానే ఒక కారులో వ్యక్తులు పారిపోగా.. రెండో కారును, అందులో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో కారుకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన బియ్యం మూట కనిపించగా.. దానిని విప్పి చూస్తే రూ.కోటి నగదు బయటపడింది. అది అన్నాడీఎంకే నేత కారుగా గుర్తించిన అధికారులు.. ఈ డబ్బు విషయంపై విచారణ జరుపుతున్నారు.
286197 841886Sweet web site, super style and design , really clean and use friendly . 288180
745388 183655so considerably amazing data on here, : D. 282177
381024 861297Some genuinely good and utilitarian info on this website, as effectively I believe the style has got fantastic features. 246941