రానా హీరోగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే హిరణ్య కశ్యప చిత్రం బాహుబలి రేంజ్ లో ఉంటుందని అంటున్నారు ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు. రేపు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు జయంతి సందర్బంగా సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో టెక్నాలజీ బాగా పెరిగిందని, ముందు ముందు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైనే ఆధారపడి ఉండాలని అంటున్నాడు. త్వరలోనే ఆంధ్రా సీఎం జగన్ ను కలవాలనుకుంటున్నట్టు తెలిపాడు. సినిమా పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. అలాగే తన బ్యానర్ లో హిరణ్య కశ్యప పేరుతొ పిరియాడికల్ సినిమా ఉంటుందని చెప్పాడు.
మా అబ్బాయి రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాం. ఈ సినిమా ప్రీ విజువలైజేషన్ కోసం వందమంది పనిచేస్తున్నారు. అదంతా పూర్తయ్యాక సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాం. ఈ చిత్రాన్ని బాహుబలి రేంజ్ లో తీయాలన్న ఆలోచనలో ఉన్నాం .. ఇండియాలోనే అతిపెద్ద సినిమాగా మారొచ్చు అంటూ హింట్ ఇచ్చేసాడు.
ప్రస్తుతం సురేష్ బాబు తన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సొంతంగా సినిమాలు తీయకుండా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వారి బ్యానర్స్ లో పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నాడు. అలా విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో మొదలయిన ఈ ప్రస్థానం ఇక ముందు కంటిన్యు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆరు సినెమాలు లైన్ లో ఉన్నాయని చెప్పాడు సురేష్ బాబు.
934883 408311Some genuinely fascinating info, well written and typically user genial . 737037