‘అత్యంత ప్రతిష్టాత్మకం’ అని చెప్పుకుంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అడపా దడపా హైకోర్టు ‘చెక్’ పెడుతోంది. నిర్ణయాల్లో డొల్లతనమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. తాజాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. 59.85 శాతాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
దీన్నొక ప్రతిష్టాత్మకమైన ఆలోచనలగా వైఎస్ జగన్ ప్రభుత్వం చెప్పుకుంది. ఆయా వర్గాల పట్ల తమకున్న అంకిత భావానికి ఇదే నిదర్శనమనీ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. యఅఇతే, 50 శాతాన్ని మించి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు గతంలోనే తప్పు పట్టింది. విషయం తెలిసీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం.. కేవలం రాజకీయ లబ్ది కోసమేనన్నది ఓపెన్ సీక్రెట్. ఈ తరహా నిర్ణయాల్ని ఎవరో ఒకరు న్యాయస్థానాల్లో సవాల్ చేస్తారు. ఆ విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు.
అలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు, తెలివిగా ఆయా వ్యక్తులు లేదా పార్టీలపై రాజకీయ బురద జల్లి, ఆయా వర్గాలకు ఆయా పార్టీలు వ్యతిరేకమనే ముద్ర వేసేయడం పరిపాటిగా మారిపోయింది వైఎస్ జగన్ ప్రభుత్వానికి. నిజానికి, రిజర్వేషన్లను జగన్ సర్కార్ ప్రకటించినప్పుడే విపక్షాలు ఈ విషయాన్ని తెరపైకి తెచ్చాయి. రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ ఎద్దేవా చేవాయి. ఆయా పార్టీల వాదనే ఇప్పుడు నిజమని తేలింది.
ఆయా వర్గాల మీద ప్రేమ కంటే, ఇక్కడ రాజకీయ లబ్దినే ప్రభుత్వం చూసిందన్నది ఇంకోసారి నిరూపితమయ్యింది. ఇదొక్కటే కాదు చాలా అంశాల్లో ఇలాగే న్యాయస్థానం ముందు ప్రభుత్వం పదే పదే బొక్క బోర్లా పడాల్సి వస్తుండడం గమనార్హం. కింద పడ్డా తమదే పైచేయి.. అంటూ ఇంకో మార్గంలో తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా.? మొట్టికాయలు పడ్డాయి కాబట్టి, ఇకనైనా సరైన ఆలోచనలు ప్రభుత్వం చేయగలుగుతుందా.? అన్నది వేచి చూడాలి.
970396 854359Hey! Do you know if they make any plugins to assist with SEO? Im trying to get my weblog to rank for some targeted keywords but Im not seeing really excellent outcomes. In case you know of any please share. Thanks! 36119