తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్రకు చుక్కెదురైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేయాలని భావించారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల ఆపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
తమిళ నిర్మాత రవి చక్ర కథ తనదేనంటూ కేసు ఫైల్ చేసాడు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. అలాగే తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో చక్ర విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆన్లైన్ మోసాల నేపథ్యంలో చక్ర తెరకెక్కింది. ఈ చిత్రంలో విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. ఎమ్మెస్ ఆనందన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా శ్రద్ధ శ్రీనాథ్, రెజీనా హీరోయిన్లుగా నటించారు. తన లాస్ట్ సినిమా ప్లాప్ నుండి బయటపడి ఈ చిత్రం ద్వారా సూపర్ హిట్ కొట్టాలని విశాల్ భావిస్తున్నాడు.
440147 558887Great site. Lots of helpful information here. 490075