రేషన్ కార్డు హోల్డర్ల పరిమితులపై కర్ణాటక రాష్ట్ర మంత్రి ఉమేశ్ కత్తి బెల్గావిలో నిన్న చేసిన ప్రకటన కలకలం రేపింది. ప్రభుత్వ ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఒక్కరోజులోనే మంత్రి యూటర్న్ తీసుకున్నారు. రేషన్ కార్డుల విషయంలో ఎటువంటి పరిమితులు లేవని చెప్పారు. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉంటే కార్డులు అప్పగించాలనే అంశంపై సీఎం యడియూరప్ప, తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కార్డుదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కొత్త కార్డులు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ అంశంపై మంత్రి మరింతగా మాట్లాడేందుకు నిరాకరించారు. నిన్న జరిగిన సమావేశంలో.. ‘టీవీ, ఫ్రిజ్, బైక్ ఉంటే స్వచ్ఛందంగా రేషన్ కార్డును వదులుకోవాలని.. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదని.. ఏడాదికి 1.20 లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉండాలని అన్నారు. ఇవన్నీ ఉన్నవారు మార్చి 31 లోపు తమ రేషన్ కార్డులను ప్రభుత్వానికి అప్పజెప్పాలని అన్నారు. మంత్రి ప్రకటనపై సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు.
853057 585911Hello there! Nice post! Please inform us when all could see a follow up! 392674
147098 631748An intriguing discussion is worth comment. Im positive which you basically write regarding this subject, might possibly not be considered a taboo topic but typically persons are too small to communicate on such topics. To one more. Cheers 821744
362409 870861Looking forward to move into another hous?! […]Real estate busines is obtaining a lot more and much more less protitable, check out why[…] 263626