గాల్వాన్ లోయలో చైనా సైనికులపై విరుచుకుపడి 43 మందిని హతమార్చిన సంఘటనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైనా సైన్యం ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన టెంటును తొలగించేందుకు వెళ్లిన కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలోని సైనికులపై చైనా సైన్యం ముళ్లకంచె చుట్టిన రాడ్లు, మేకులు కొట్టిన బ్యాట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్ బెటాలియన్ ఊహించని ఈ పరిణామాన్ని వెంటనే ఎదుర్కొని చైనా సైనికుల్లో కొందరని మట్టుబెట్టగలిగింది. అయితే, మనోళ్ల కంటే చైనా సైనికులు ఆ సమయంలో ఎక్కువగా ఉండటం.. పైగా వారు దొంగ దెబ్బ తీయడంతో కల్నల్ సంతోష్ బృందం ఎక్కువగా నష్టపోయింది.
ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న మరో భారత రెజిమెంట్ చైనా వాళ్ల పని పట్టింది. ఈలోగా వీరికి తోడుగా మరో విధ్వంసక బృందం అక్కడకు దిగిపోయింది. వారే ఘాతక్ కమాండోస్. దొరికినోళ్లను దొరికినట్టుగా చీల్చి చెండాడారు. వారి ధాటికి చైనా సైన్యం అక్కడ నిలవలేక పారిపోయింది. దీంతో ఈ ఘాతక్ కమాండోస్ గురించి చాలామందిలో ఆసక్తి పెరిగింది. వారి గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో సెర్చింగ్ ఎక్కువైంది. ప్రతి దేశానికి త్రివిధ దళాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక దళాలు ఉంటాయి. ఈ దళాల శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాలుగా వారికి శిక్షణ ఇస్తారు.
భారత్ కు చెందిన ఇలాంటి ప్రత్యేక దళాల్లో ఈ ఘాతక్ కమాండోస్ ఒకటి. భారత ఆర్మీకి సంబంధించి ప్రతి ఇన్ ఫాంట్రీ బెటాలియన్ లో ఒక ఘాతక్ ప్లాటూన్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్లాటూన్ లో 20 మంది ఉంటారు. వీరిలో ఒక కమాండింగ్ ఆఫీసర్ తోపాటు ఇద్దరు నాన్ కమీషన్డ్ ఆఫీసర్స్, స్నైపర్స్, లైట్ గన్నర్స్, మెడిక్స్, రేడియో ఆపరేటర్.. ఇలా అందరితో కలిసి ఈ ట్రూప్ ఉంటుంది. ఇక వీరి దగ్గర అత్యాధునిక ఆయుధాలు, సామగ్రి ఉంటాయి. వీరు రంగంలోకి దిగితే విధ్వంసమే. వీరి ప్రధాన లక్ష్యం శత్రువులను చంపడంతోపాటు వారి ఆయుధాలను ధ్వంసం చేయడం. పైగా శత్రువులకు చాలా సమీపంలోకి వెళ్లి వారిపై విరుచుకుపడటం ఘాతక్ కమాండోల ప్రత్యేకత. నేరుగా వారితో తలపడటంలోనూ వీరు పూర్తిస్థాయి శిక్షణ పొంది ఉంటారు. ఇదే గాల్వన్ లోయలో చైనా సైనికుల పీచమణచడానికి దోహదపడింది. నేరుగా చైనా సైనికులపై విరుచుకుపడటంతో వారు పలాయం చిత్తగించాల్సి వచ్చింది.
చివరకు తమ సైనికులు ఎంతమంది చచ్చిపోయారో కూడా లెక్క బయటకు వెల్లడించలేక డ్రాగన్ కంట్రీ తేలు కుట్టిన దొంగలా మిన్నకుండిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఘర్షణల్లో అమరులైన భారత సైనికులకు సైనిక వందనంతో అంత్యక్రియలు జరిపామని, జనం వారికి జైజైలు పలికారని.. మరి చైనాలో అలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
503316 844027Oh my goodness! a fantastic post dude. Several thanks Nevertheless We are experiencing problem with ur rss . Dont know why Can not sign up to it. Could there be anybody obtaining identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 962437
220104 905688Nice to be visiting your blog once a lot more, it continues to be months for me. Nicely this post that ive been waited for so lengthy. I want this article to total my assignment in the university, and it has very same subject together along with your post. Thanks, terrific share. 667895