Switch to English

స్పెషల్ స్టోరీ: చైనా సైనికులను చీల్చి చెండాడిన ఘాతక్ కమాండోస్ గురించి తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

గాల్వాన్ లోయలో చైనా సైనికులపై విరుచుకుపడి 43 మందిని హతమార్చిన సంఘటనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైనా సైన్యం ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన టెంటును తొలగించేందుకు వెళ్లిన కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలోని సైనికులపై చైనా సైన్యం ముళ్లకంచె చుట్టిన రాడ్లు, మేకులు కొట్టిన బ్యాట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్ బెటాలియన్ ఊహించని ఈ పరిణామాన్ని వెంటనే ఎదుర్కొని చైనా సైనికుల్లో కొందరని మట్టుబెట్టగలిగింది. అయితే, మనోళ్ల కంటే చైనా సైనికులు ఆ సమయంలో ఎక్కువగా ఉండటం.. పైగా వారు దొంగ దెబ్బ తీయడంతో కల్నల్ సంతోష్ బృందం ఎక్కువగా నష్టపోయింది.

ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న మరో భారత రెజిమెంట్ చైనా వాళ్ల పని పట్టింది. ఈలోగా వీరికి తోడుగా మరో విధ్వంసక బృందం అక్కడకు దిగిపోయింది. వారే ఘాతక్ కమాండోస్. దొరికినోళ్లను దొరికినట్టుగా చీల్చి చెండాడారు. వారి ధాటికి చైనా సైన్యం అక్కడ నిలవలేక పారిపోయింది. దీంతో ఈ ఘాతక్ కమాండోస్ గురించి చాలామందిలో ఆసక్తి పెరిగింది. వారి గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో సెర్చింగ్ ఎక్కువైంది. ప్రతి దేశానికి త్రివిధ దళాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక దళాలు ఉంటాయి. ఈ దళాల శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాలుగా వారికి శిక్షణ ఇస్తారు.

భారత్ కు చెందిన ఇలాంటి ప్రత్యేక దళాల్లో ఈ ఘాతక్ కమాండోస్ ఒకటి. భారత ఆర్మీకి సంబంధించి ప్రతి ఇన్ ఫాంట్రీ బెటాలియన్ లో ఒక ఘాతక్ ప్లాటూన్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్లాటూన్ లో 20 మంది ఉంటారు. వీరిలో ఒక కమాండింగ్ ఆఫీసర్ తోపాటు ఇద్దరు నాన్ కమీషన్డ్ ఆఫీసర్స్, స్నైపర్స్, లైట్ గన్నర్స్, మెడిక్స్, రేడియో ఆపరేటర్.. ఇలా అందరితో కలిసి ఈ ట్రూప్ ఉంటుంది. ఇక వీరి దగ్గర అత్యాధునిక ఆయుధాలు, సామగ్రి ఉంటాయి. వీరు రంగంలోకి దిగితే విధ్వంసమే. వీరి ప్రధాన లక్ష్యం శత్రువులను చంపడంతోపాటు వారి ఆయుధాలను ధ్వంసం చేయడం. పైగా శత్రువులకు చాలా సమీపంలోకి వెళ్లి వారిపై విరుచుకుపడటం ఘాతక్ కమాండోల ప్రత్యేకత. నేరుగా వారితో తలపడటంలోనూ వీరు పూర్తిస్థాయి శిక్షణ పొంది ఉంటారు. ఇదే గాల్వన్ లోయలో చైనా సైనికుల పీచమణచడానికి దోహదపడింది. నేరుగా చైనా సైనికులపై విరుచుకుపడటంతో వారు పలాయం చిత్తగించాల్సి వచ్చింది.

చివరకు తమ సైనికులు ఎంతమంది చచ్చిపోయారో కూడా లెక్క బయటకు వెల్లడించలేక డ్రాగన్ కంట్రీ తేలు కుట్టిన దొంగలా మిన్నకుండిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఘర్షణల్లో అమరులైన భారత సైనికులకు సైనిక వందనంతో అంత్యక్రియలు జరిపామని, జనం వారికి జైజైలు పలికారని.. మరి చైనాలో అలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...