ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరిగి పోతుంది. అమెరికాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండగా ఇండియాలో కూడా కరోనా కేసులు రోజుకు 13 వేల నుండి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయి. లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నేటితో ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరనుంది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అంటూ నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన ఒక అధ్యయన సంస్థ ఇండియాలో జులై 15 నాటికి 8 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉన్న ఇండియా త్వరలోనే నెం.2 స్థానంకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో మృతుల సంఖ్య తక్కువగా ఉండటంతో కాస్త ఉపశమనం కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కాస్త స్లోగా ఉందనిపిస్తుంది. కరోనా కేసులు ఎంతగా పెరిగినా కూడా మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.
450803 765072Sweet internet website , super style , genuinely clean and utilize genial . 293007