చాలా ఏళ్ల క్రితం విజయవాడలో గ్యాంగ్ వార్స్ జరుగుతూ ఉండేవి. కాని ఈమద్య కాలంలో గ్యాంగ్ వార్స్ జరగలేదు. మళ్లీ కొన్ని రోజుల క్రితం విజయవాడలో గ్యాంగ్ వార్ జరిగింది. ఆ గ్యాంగ్ వార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గ్యాంగ్ వార్ పై పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు అదే తరహా గ్యాంగ్ వార్ తెలంగాణ రాష్ట్రం వేములవాడలో జరిగింది. చిన్న గొడవతో మొదలైన ఈ వార్ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.
వేములవాడ పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిషత్ కార్యలయం వద్ద దాదాపు పాతిక మంది 20 నిమిషాల పాటు ఈ గ్యాంగ్ వార్ జరిగింది. ఒక యువకుడు బైక్ స్పీడ్గా వెళ్తుండగా అతడిని ఆపి మందలించినందుకు గాను అతడు తన గ్యాంగ్ను తీసుకు రావడంతో ఈ గ్యాంగ్ వార్ మొదలైందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ గ్యాంగ్ వార్ను ఆపలేక కేవలం ఫోన్లో చిత్రీకరణ చేస్తూ మాత్రమే ఉండి పోయారు. స్థానికంగా ఈ సంఘటన చర్చనీయాంశం అయ్యింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వేములవాడలో ఇలాంటి సంఘటన జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు.
664073 602487Id always want to be update on new content on this site , saved to fav! . 206508